logo

Crime News: ‘మీ వయసు 50.. నాది 25 అయినా పర్లేదు.. మిమ్మల్నే పెళ్లి చేసుకుంటా’

మీ వయసు 50.. నా వయసు 25 అయినా.. పట్టించుకోను.. మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.46 లక్షలు కాజేసిందో సైబర్‌ ‘కి‘లేడి’. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌

Updated : 23 Apr 2022 07:33 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: మీ వయసు 50.. నా వయసు 25 అయినా.. పట్టించుకోను.. మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.46 లక్షలు కాజేసిందో సైబర్‌ ‘కి‘లేడి’. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ వివరాల ప్రకారం... జూబ్లిహిల్స్‌లో నివాసముండే 50 ఏళ్లు దాటిన వ్యక్తి రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మ్యాట్రిమోని సైట్‌లో తన ప్రొఫైల్‌ పెట్టారు. ఇది జరిగిన రెండో రోజే ఓ అమ్మాయి డీపీతో ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. దానికి అంగీకరించారు. మీరు నచ్చారు. మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. ఇంజినీరింగ్‌ చదువుతున్నట్లు చెప్పి ఫీజు కట్టాలని, కొవిడ్‌ వచ్చిందని.. ఇలా పలు కారణాలతో మొత్తం రూ.46 లక్షలు లాగేసింది. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.

ఎంబీబీఎస్‌ సీట్లు ఇప్పిస్తామని రూ.10.50 లక్షలు..

కవాడిగూడకు చెందిన తోడల్లుళ్లు తమ ఇద్దరి పిల్లలకు నీట్‌లో మంచి ర్యాంక్‌ రాక ఎంబీబీఎస్‌ సీటు దక్కలేదు. మీ పిల్లలకు రాయ్‌చూర్‌లో సీట్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఫోన్‌ చేసి నమ్మించాడు. దీంతో తోడల్లుళ్లు రెండు సీట్లకు రూ.10.50లక్షలు పంపించేశారు. మరుసటి రోజే రాయ్‌చూర్‌లోని ఓ మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చినట్లుగా లెటర్లు వచ్చాయి. అక్కడకు వెళ్లగా నకిలీవని తేలింది. బాధితులు సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని