Telangana News: ప్రియురాలి ఇంటిముందు ప్రియుడి అనుమానాస్పద మృతి
ప్రియురాలి ఇంటిముందు ప్రియుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో జరిగింది. మంథని ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం పాపయ్యపేటకు
పెద్దపల్లి జిల్లాలో ఘటన
సందీప్
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి, న్యూస్టుడే, మంథని గ్రామీణం: ప్రియురాలి ఇంటిముందు ప్రియుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో జరిగింది. మంథని ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన గాలి సందీప్ (21) హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతూ వసతిగృహంలో ఉంటున్నాడు. ఇతని తండ్రి గాలి వెంకన్న హమాలీ పని చేస్తుండగా తల్లి విజయ వ్యవసాయ దినసరి కూలీగా పనిచేస్తోంది. ఇతని సోదరి హనుమకొండలోని వసతిగృహంలో ఉంటూ పోటీపరీక్షలకు సిద్ధమవుతోంది. కాగా మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఓ అమ్మాయి హనుమకొండలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్నప్పుడు సందీప్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ప్రేమగా భావించి పెళ్లి చేసుకుందామంటూ వేధింపులకు గురిచేయడంతో విషయం అమ్మాయి తల్లిదండులకు తెలిసింది. దీంతో ఆమెను కరీంనగర్లోని ఓ డిగ్రీ కళాశాలలో చేర్చి చదివిస్తున్నారు. ప్రేమ విషయమై పలుమార్లు సందీప్ను హెచ్చరించినా తనను వివాహం చేసుకోవాలని అమ్మాయిని వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో ప్రతీకారంగా గతంలో వారిద్దరూ కలిసి ఉన్న చిత్రాలను గుంజపడుగు గ్రామానికి చెందిన కొందరు యువకులకు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఈ విషయం తెలిసి అమ్మాయి తండ్రి మంథని గత ఫిబ్రవరిలో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వేధింపుల కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం ఏప్రిల్ 22న సందీప్ బెయిల్పై విడుదలయ్యాడు. ఏప్రిల్ 23న సందీప్ బాబాయ్ శ్రీనివాస్తో కలిసి మంథని పోలీస్స్టేషన్కు వెళ్లి కండీషన్ బెయిల్ ప్రకారం సంతకం చేసి తిరిగి అదే రోజున వారిద్దరూ కాజీపేటలోని శ్రీనివాస్ ఇంట్లోనే నిద్రపోయారు. 24న సందీప్ తన సోదరిని హనుమకొండలోని వసతిగృహంలో దింపేసి ఇంటికి వెళతానని చెప్పాడు. అర్ధరాత్రి దాటినా సందీప్ ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు చెన్నారావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా ఆదివారం అర్ధరాత్రి సందీప్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడని గోదావరిఖని ప్రాంతీయాసుపత్రికి తరలిస్తున్నామని మంథని 108 సిబ్బంది చెన్నారావుపేట పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్య సిబ్బంది సూచన మేరకు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సందీప్ చనిపోయినట్లు వివరించారు. తమ కుమారుడి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని సందీప్ తండ్రి వెంకన్న పోలీస్లకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు.
ఎవరూ ప్రేమించవద్దంటూ సందేశం
ఎవరూ ప్రేమ పేరుతో తనలాగా మోసపోవద్దని సందీప్ తన స్నేహితులకు సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టుపెట్టాడు. జైలు జీవితం ఎవరికీ వద్దని ఐ మిస్యూ ఫ్రెండ్స్ అంటూ సందేశాలు పంపి తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు అతని స్నేహితులు చెబుతున్నారు. తను చనిపోతున్నానని వీలైతే తన తల్లితండ్రులకు, సోదరికి సాయం చేయాలని సందేశాల్లో కోరాడని చెబుతున్నారు.
గుంజపడుగులో కలకలం
ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మంథని మండలంలో గుంజపడుగులో సోమవారం కలకలం సృష్టించింది. ఒంటిపై పెట్రోల్పోసుకొని నిప్పంటించుకున్నట్లు స్థానికులు చెబుతున్నా వాస్తవానికి ఎవరైనా ఒంటిపై పోసి నిప్పంటించారా? అతనే ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనేది చిక్కుప్రశ్నగా మారింది. హనుమకొండ నుంచి ఆదివారం రాత్రి బయల్దేరి ఇంటికి వస్తానని చెప్పిన సందీప్ అక్కడి నుంచి నేరుగా మంథనికి ఒక్కడే వెళ్లాడా? ఇంకా ఎవరి సాయంతోనైనా వచ్చాడా? అనేది తేలాల్సి ఉంది. కాగా గుంజపడుగులో సందీప్ ప్రియురాలి ఇంటి ముందు గొడవ చేస్తున్నాడని ముందుగా యువతి తండ్రి అర్ధరాత్రి సమయంలో మంథని ఎస్సైకి సమాచారం ఇవ్వగా కానిస్టేబుళ్లను అక్కడికి పంపించినట్లు తెలిసింది. ఈలోగా మరోసారి ఫోన్చేసిన యువతి తండ్రి సందీప్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో ఎస్సై 108 వాహనానికి సమాచారం ఇచ్చి పోలీసులను, స్థానికులను సందీప్ను రక్షించేందుకు అప్రమత్తం చేశారు. పోలీసులు చేరుకోగానే సందీప్ను 108 వాహనంలో తరలించి గోదావరిఖని ప్రాంతీయాసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. ఇతర ప్రాంతం నుంచి వచ్చిన యువకుడు పెట్రోల్ సీసాతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పే క్రమంలో గ్రామంలో అలజడి ఉంటుంది. స్థానికులు అడ్డుకోవడం, నచ్చజెప్పటం చేస్తుంటారు. ఈ గ్రామంలో అటువంటి పరిస్థితులు కనిపించలేదు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ మరణ వార్తతో పాపయ్యపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికందివచ్చిన కుమారుడి ఆత్మహత్యతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. సందీప్ మృతదేహాన్ని సోమవారం స్వగ్రామానికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారసత్వ సంపద పరిరక్షణకు ఓటేద్దాం
[ 20-04-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. -
ఇదీ అన్నదాత ఎజెండా!
[ 20-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. భిన్న వ్యవసాయ ఉత్పత్తులతో రాష్ట్రంలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. దేశ విదేశాలకు ఎగుమతి చేసే పసుపు, మామిడి, మొక్కజొన్న, సన్న వరి, చెరకు, ఆవాలు, ఎర్రజొన్న, తెల్లజొన్న, సజ్జ తదితర పంటల దిగుబడిలో ఆదర్శంగా నిలుస్తున్నా అన్నదాతను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. -
ఒక ఎంపీ.. అయిదు జిల్లాలు
[ 20-04-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది. -
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
[ 20-04-2024]
ఇటుక బట్టీ వద్ద నీటి తొట్టిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. కుటుంబసభ్యులు పోలీసుల కథనం ప్రకారం.. -
శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి
[ 20-04-2024]
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థినులకు కరీంనగర్ కేజీబీవీలో నిర్వహిస్తున్న ఎప్సెట్ శిక్షణ తరగతులను సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి మల్లయ్య భట్టు శుక్రవారం సందర్శించారు. -
కరీంనగర్లో రూ.15.81 లక్షల పట్టివేత
[ 20-04-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శుక్రవారం పోలీసులు కరీంనగర్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.15.81 లక్షల నగదును పట్టుకున్నట్లు కమిషనర్ కార్యాలయం తెలిపింది. -
ఇంటి నుంచే ఓటింగ్పై అధికారులకు శిక్షణ
[ 20-04-2024]
ఇంటినుంచే ఓటింగ్పై పాటించాల్సిన నిబంధనలపై అధికారులకు మంథని శాసనసభ సెగ్మెంట్ అధికారి హనుమనాయక్ అవగాహన కల్పించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు శిక్షణ ఇచ్చారు. -
అడుగడుగునా తనిఖీలతో ప్రలోభాలకు అడ్డుకట్ట
[ 20-04-2024]
ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం
[ 20-04-2024]
బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. -
కిట్టు సరే.. పరీక్ష చేసేవారేరీ?
[ 20-04-2024]
కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్కడక్కడ పైపులు పగిలి లీకేజీతో కలుషితమైన నీరు సరఫరా అయ్యే అవకాశం ఉంది. -
ఆరేళ్లుగా ఉపాధి కరవు
[ 20-04-2024]
వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కోసం ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఆ కుటుంబాలకు పనులు కల్పించడం లేదు. -
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. -
‘పసుపు బోర్డు పేరుతో మోసం’
[ 20-04-2024]
పసుపు బోర్డు పేరుతో ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!