logo

Hyd News: యజమాని మందలింపు.. ఉద్యోగి ఆత్మహత్య

యజమాని మందలించినందుకు మనస్తాపంతో ఓ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

Updated : 28 Apr 2022 08:14 IST

వనస్థలిపురం, న్యూస్‌టుడే: యజమాని మందలించినందుకు మనస్తాపంతో ఓ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి జిల్లా, పోచంపల్లి మండలం దంతూరుకు చెందిన జి.సత్యనారాయణ(46) వనస్థలిపురం సాయినాథ్‌ కాలనీలో ఉంటూ స్థానికంగా ఓ ఫైనాన్స్‌ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. కంపెనీ డబ్బును సొంత అవసరాలకు వాడుకున్నాడు. ఈ విషయమై యజమాని మందలించాడు. డబ్బు తిరిగి చెల్లించాలనడంతో కొంత చెల్లించాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. యజమాని తిట్టినందుకు తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని బంధువులు ఆందోళన చేసేందుకు ఠాణాకు చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో ఆందోళన విరమించి ఇంటికి వెళ్లి పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని