తండ్రి కాదు కసాయి.. కుమార్తె, ఇద్దరు కుమారులను హతమార్చిన రాక్షసుడు!
రాతి గుండెలను సైతం కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలోని కొయిడా సమితిలోని కొలాగాన్ ముండా సాయి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పండా ముండాకు భార్య దోబీ ముండా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సారాకు బానిసైన ముండా తాగొచ్చి ప్రతి రోజు భార్యతో గొడవ పడేవాడు.
చిన్నారుల మృతదేహాలు
సారా.. చక్కటి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తాగిన మత్తులో కన్న తండ్రి కసాయిగా మారాడు. ముక్కు పచ్చలారని పిల్లల పట్ల కర్కశంగా వ్యవహరించాడు. గాఢ నిద్రలో ఉన్న కుమార్తె, ఇద్దరు కుమారులను బావిలోకి తోసి చంపేశాడు. ముగ్గురిలో ఒకరు మూడు నెలల పసికందు.
రాతి గుండెలను సైతం కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలోని కొయిడా సమితిలోని కొలాగాన్ ముండా సాయి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పండా ముండాకు భార్య దోబీ ముండా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సారాకు బానిసైన ముండా తాగొచ్చి ప్రతి రోజు భార్యతో గొడవ పడేవాడు. శనివారం రాత్రి యధావిధిగా తాగొచ్చిన ముండాను భార్య ప్రశ్నించడంతో ఆమెపై చేయిచేసుకున్నాడు. గొడ్డలితో దాడి చేసేందుకు ప్రయత్నించగా దోబీ తప్పించుకుంది. దాంతో నిద్ర పోతున్న పిల్లలు సిమా ముండా(5), కుమారుడు రాజు ముండా(2), ముడు నెలల మగశిశువును తీసుకెళ్లి ఇంటి వెనక ఉన్న బావిలో పడేసి పరారయ్యాడు. పొరుగింట్లో రాత్రంతా తలదాచుకున్న దోబీ ముండా ఉదయం ఇంటికి వచ్చి చూడగా పిల్లలు కనిపించలేదు. చుట్టుపక్కల గాలిస్తున్న క్రమంలో బావిలో చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. విషయం గ్రామస్థులకు, పోలీసులకు తెలియజేసింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని బావిలో మృతదేహాలను వెలికి తీశారు. నిర్జీవంగా పడి ఉన్న కన్నబిడ్డలను చూసిన తల్లి దోబీ గుండెలవిసేలా రోదించింది. సంఘటన స్థలంలో గుమిగూడిన ఇరుగుపొరుగు సైతం పసిబిడ్డల మృతదేహాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.
గుండెలవిసేలా రోదిస్తున్న తల్లి దోబీ ముండా
మృతదేహాలను వెలికి తీసేందుకు బావిలోకి దిగుతున్న అగ్నిమాపకశాఖ ఉద్యోగి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు