logo

Crime News: అందంగా లేవంటూ వేధింపులు.. వివాహిత బలవన్మరణం

భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా నెల్లికుంటకు చెందిన

Updated : 04 May 2022 09:18 IST

నాగోలు, న్యూస్‌టుడే: భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా నెల్లికుంటకు చెందిన మాధురి(26)కి నారాయణ్‌పేట జిల్లా పెద్ద జట్రంకు చెందిన సతీష్‌కుమార్‌రెడ్డితో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. మాధురి బీఈడీ చదివింది. సతీష్‌రెడ్డి మార్కెటింగ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదిక్రితం ఉద్యోగాన్ని నగరంలోని బ్యాంకు శాఖకు మార్చుకున్నాడు. బీఎన్‌రెడ్డినగర్‌ సమీపంలోని వెంకటేశ్వరకాలనీలో అద్దెఇంట్లో కాపురం పెట్టాడు. వారంలో రెండ్రోజులు మహబూబ్‌నగర్‌ శాఖలో పని ఉందని వెళ్లేవాడు. అందంగా లేవంటూ భార్యను వేధించేవాడు. పెళ్లి వేళ కోరిన కట్న కానుకలన్నీ ఇచ్చినా అదనపుకట్నానికి వేధించసాగాడు. ఈ క్రమంలో ఓ మహిళతో సతీష్‌రెడ్డికి అక్రమ సంబంధం ఉందని తేలడంతో ఆ మహిళ భర్త ఇతనిపై వనస్థలిపురం ఠాణాలో కేసు నమోదుచేయించాడు. తరువాత కూడా సతీష్‌రెడ్డి వేధింపుల్లో మార్పు రాలేదు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మాధురి ఉరివేసుకుంది. భర్త వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ మృతురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదుచేశారు. ఎల్బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి నుదురుపైన గాయాలుండటంతో మృతికి గల కారణాలేవో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని