Hyderabad News: హైదరాబాద్లో ట్రాఫిక్ జాం.. యాప్తో పరిష్కారం
అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జాంల పరిష్కారానికి కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. గూగుల్ సంస్థ ట్రాఫిక్
గూగుల్తో హైదరాబాద్ పోలీసుల ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్
అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జాంల పరిష్కారానికి కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. గూగుల్ సంస్థ ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ను వినియోగించడం ద్వారా అనుకోకుండా జరిగే సంఘటనలు, వీవీఐపీల రాకపోకలు, ర్యాలీలు, ధర్నాలు కారణంగా అప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే ట్రాఫిక్ జాంల ప్రభావాన్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు సమాచారం అందేవిధంగా గూగుల్ మ్యాప్లో అప్డేట్ చేయనున్నారు. ఇందుకోసం ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు, ఎస్సైలు, ఇన్స్పెక్టర్ల చరవాణుల్లో ఈ యాప్ను ఏర్పాటు చేశారు. ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమవడంతోపాటు క్యాబ్లు, ప్రైవేటు వాహనాల్లో నగరానికి వచ్చే పర్యాటకులు, వాహనదారులు, డెలివరీబాయ్లతో సహా రోజుకు 15 లక్షల నుంచి 20 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని ట్రాఫిక్ పోలీస్ అధికారులు అంచనా వేశారు. కొద్దిరోజుల క్రితమే గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నామని, ప్రయోగాత్మకంగా యాప్ను పనితీరును పర్యవేక్షిస్తున్నామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
న్యూయార్క్ తరహాలో...
న్యూయార్క్ నగరంలో రాకపోకలు కొనసాగించే వాహనదారులు, ప్రయాణికులు ట్రాఫిక్లో చిక్కుకోకుండా అక్కడి ట్రాఫిక్ పోలీసులు గూగుల్ మ్యాప్లో సమస్త ప్రయాణ సమాచారాన్ని ఉంచుతున్నారు. ఎక్కడ వాహనాలు ఆగిపోయినా.. ట్రాఫిక్ కూడళ్ల రద్దీ ఏర్పడినా ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలను మ్యాప్లో అప్డేట్ చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ప్రభావం పడే అవకాశాలున్నాయని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ ట్రాఫిక్ పోలీసులు ఆయా మార్గాలను వాహనదారులకు సూచిస్తున్నారు. గూగుల్ మ్యాప్లో వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ జాంలపై ప్రకటనలను ఉంచేందుకు 24 గంటలు ఐటీ విభాగం అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ‘గెట్ కనెక్టెడ్ గో’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.
అనూహ్య ఘటనలు.. యాప్లో అప్లోడ్
నగరంలో ట్రాఫిక్ జాంలపై సమాచారాన్ని గూగుల్ మ్యాప్లో ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. కూడళ్లు, ముఖ్యప్రాంతాల్లో సీసీ కెమెరాలు తీస్తున్న దృశ్యాల ఆధారంగా ట్రాఫిక్ పరిపాలన విభాగం, కమాండ్ కంట్రోల్ నుంచి సమాచారం నమోదుచేస్తున్నారు. ప్రధాన ప్రాంతాలు, అనుసంధాన రహదారులపై అనుకోకుండా జరిగే ఘటనలు, ర్యాలీలు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి రావడం లేదు. ఆయా ప్రాంతాల్లో రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇందుకు పరిష్కారంగా అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఫోన్యాప్లో ఫొటోలు తీసినా, వివరాలు పంపినా ఆ సమాచారం కమాండ్ కంట్రోల్కు వెళ్లి వెంటనే గూగుల్ మ్యాప్ చూస్తున్నవారందరికీ తెలుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!