logo

Andhra News: బాలికపై ఆర్‌ఎంపీ అత్యాచారం

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న బాలిక (14) పై బి.దొడ్డవరానికి చెందిన యువకుడు వేగి రమేష్‌ అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై

Updated : 04 May 2022 09:49 IST

మామిడికుదురు, న్యూస్‌టుడే: కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న బాలిక (14) పై బి.దొడ్డవరానికి చెందిన యువకుడు వేగి రమేష్‌ అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై నగరం పోలీసులు మంగళవారం సాయంత్రం కేసు నమోదు చేశారు. ఆర్‌ఎంపీగా పనిచేసే నిందితుడు సాధారణ వైద్యం చేసేందుకు ఇంటికొచ్చి తన కుమార్తె చరవాణి నెంబరు తీసుకుని మభ్యపెట్టి పరిచయం చేసుకున్నాడన్నారు. సోమవారం రాత్రి నాన్నమ్మతో కలిసి డాబాపై ఆమె పడుకుందని, కాలకృత్యాలు తీర్చుకునేందుకు నానమ్మ బయటకెళ్లిన సమయంలో నిందితుడు రహస్యంగా డాబాపైకి వెళ్లి తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి ఎస్సై బి.కృష్ణమాచారి పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని