logo

Crime News: దంపతుల మధ్య చరవాణి చిచ్చు.. భార్య బలవన్మరణం

ప్రేమించి పెళ్లి చేసుకున్న నూతన జంట మధ్య చరవాణి చిచ్చు పెట్టింది. మనస్తాపంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహస్వామి కథనం ప్రకారం.. కృపాకాంప్లెక్స్‌లో ఉండే దివ్య(21), సప్తగిరి కాలనీలో

Updated : 06 May 2022 05:15 IST

వివాహమైన 5 నెలలకే ఘటన


దివ్య

నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్న నూతన జంట మధ్య చరవాణి చిచ్చు పెట్టింది. మనస్తాపంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహస్వామి కథనం ప్రకారం.. కృపాకాంప్లెక్స్‌లో ఉండే దివ్య(21), సప్తగిరి కాలనీలో ఉంటున్న నవీన్‌ గత డిసెంబరులో ప్రేమ వివాహం చేసుకున్నారు. దివ్య చరవాణిలో ఎక్కువగా మాట్లాడుతుండటంతో ఇటీవల దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈనెల 4న దివ్య, తన చావుకు ఎవరూ బాధ్యులు కారని చేతిపై రాసుకొని ఉరేసుకొంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని