Hyd News: కబలిస్తున్న క్యాన్సర్.. దాతల చేయూత కోసం ఎదురుచూపులు
భార్యను దక్కించుకోవాలని తపిస్తున్న భర్త.. తల్లి ఆరోగ్య పరిస్థితిని నయం చేసుకోవాలనుకుంటున్న కూతుళ్లు.. విధిరాతకు ఎదురీదుతోంది ఆ కుటుంబం. కంటోన్మెంట్ ప
కుటుంబ సభ్యులతో లావణ్య
కంటోన్మెంట్, న్యూస్టుడే: భార్యను దక్కించుకోవాలని తపిస్తున్న భర్త.. తల్లి ఆరోగ్య పరిస్థితిని నయం చేసుకోవాలనుకుంటున్న కూతుళ్లు.. విధిరాతకు ఎదురీదుతోంది ఆ కుటుంబం. కంటోన్మెంట్ పరిధి న్యూబోయిన్పల్లి లక్ష్మినగర్బస్తీకి చెందిన సుధాకర్ ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు భార్య లావణ్య, కుమార్తెలు వైష్ణవి, మహేశ్వరి, శ్రావణి, రేవతి ఉన్నారు. లావణ్య టైలరింగ్ చేసుకుంటూ భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. తరువాత ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. చివరకు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.
పెద్దకుమార్తె నగలు కుదవపెట్టి.. లావణ్యకు కీమోథెరపీ, రేడియేషన్ చేయించాలని వైద్యులు సూచించారు. వివాహమైన పెద్దకుమార్తె నగలను కుదవపెట్టి రూ.3లక్షలు సమకూర్చుకున్నారు. తరువాత కుటుంబ సభ్యులు మరో రూ.9లక్షలు అప్పుచేసి శస్త్ర చికిత్స చేయించారు. దీంతో ఆ కుటుంబం పూర్తిగా అప్పుల ఊబీలో కూరుకుపోయింది. ఈ సమయంలోనే కొవిడ్ రూపంలో ఆ కుటుంబంపై మరో పిడుగు పడింది. సుధాకర్ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. శస్త్రచికిత్సతో అంతా సాఫీగా సాగిపోతుందని అనుకునేలోపు లావణ్యకు మరోమారు పరీక్షలు నిర్వహించిన వైద్యులు రూ.12లక్షల ఖర్చుతో కూడుకున్న ఇమ్యూనోథెరపీ చేయాలని సూచించారు. ఈ క్రమంలోనే అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి సుధాకర్ స్థానికంగా ఉన్న తన ఇంటిని విక్రయించాడు. అయినా అప్పులు పూర్తిగా తీరలేదు. ఇంత చేసినా లావణ్య ఆరోగ్య పరిస్థితి పూర్తిగా కుదటపడకపోవడం, ఇమ్యూనోథెరపీకి రూ.12లక్షలు కావాల్సిరావడం, ఆర్థికస్థితి సరిగాలేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో సుధాకర్ కుటుంబం దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. దాతలు 9704442724లో ఈనాడు ప్రతినిధిని సంప్రదించి సాయం చేయవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ హాట్ ఠాణా
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా