logo

Crime News: అమ్మను చంపింది ఒక్కరు కాదు.. నలుగురు

దత్తపుత్రుడి చేతిలో హత్యకు గురైన తల్లి కేసులో మరో ముగ్గురు నిందితులున్నట్లు తేలింది. ముగ్గురూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలోని

Updated : 11 May 2022 11:08 IST

నాగోలు, న్యూస్‌టుడే: దత్తపుత్రుడి చేతిలో హత్యకు గురైన తల్లి కేసులో మరో ముగ్గురు నిందితులున్నట్లు తేలింది. ముగ్గురూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలోని పీఅండ్‌టీ కాలనీలో నివసించే భూదేవి(58), జంగయ్య దంపతులు సాయితేజ(26)ను దత్తత తీసుకున్నారు. జంగయ్య రియల్‌ వ్యాపారి కాగా.. సాయితేజ జులాయిగా తిరుగుతున్నాడు. మానసిక పరిపక్వత లేని సాయితేజను ఇంటి నుంచి పెద్దఎత్తున డబ్బు తేవాలని అతని స్నేహితులు ముగ్గులోకి దింపారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సాయితేజతో పాటు ఆ ఇంట్లోకి చేరిన ఆ ముగ్గురు స్నేహితులు పై అంతస్తులో నిద్రిస్తున్న అతని తల్లిని హత్యచేశారు. ఒకరు కాళ్లు, ఒకరు చేతులు పట్టుకోగా మిగతా ఇద్దరు ఆమె ముక్కు, నోరు మూసి హత్యకు పాల్పడ్డారు. అనంతరం అల్మారాలోని 30 తులాల బంగారం, నగదుతో పారిపోయారు. ఈ కేసులో ఆ ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న సాయితేజ కోసం గాలిస్తున్నారు. అతణ్ని తప్పించేందుకు మరో వ్యక్తి తోడుగా ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని