Suicide: కుమారుడి పెళ్లి కాలేదని..చావే పరిష్కారమని..
ఎటువంటి ఇబ్బందుల్లేని కుటుంబం. కొడుక్కి పెళ్లికావట్లేదనే బెంగతో కన్నతల్లి.. సోదరుడు ఒంటరిగా మిగిలిపోతాడనేది ఆ చెల్లెలు గుబులు. మానసిక
మనవడి గొంతు నులిమి ఉరేసుకొన్న అమ్మమ్మ
కూతురి ఆత్మహత్యాయత్నం విఫలం
ఈనాడు, హైదరాబాద్ నిజాంపేట, న్యూస్టుడే: ఎటువంటి ఇబ్బందుల్లేని కుటుంబం. కొడుక్కి పెళ్లికావట్లేదనే బెంగతో కన్నతల్లి.. సోదరుడు ఒంటరిగా మిగిలిపోతాడనేది ఆ చెల్లెలు గుబులు. మానసిక సంఘర్షణకు గురయ్యారు. చావే పరిష్కారమనుకున్నారు. తాము దూరమైతే పసివాడు అనాథగా మారతాడని భావించారు. ముందుగా బాలుడిని గొంతు నులిమి చంపారు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో అమ్మమ్మ, మనవడు మరణించగా బాలుడి తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాచుపల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకున్న దారుణం గురువారం వెలుగుచూసింది. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడ్పల్లి గ్రామానికి చెందిన ముక్కా కృష్ణమూర్తి, లలిత (56) దంపతులకు కుమారుడు శ్రీకర్, ఇద్దరు కుమార్తెలు.. అర్చన, దివ్య (32) సంతానం. 12 ఏళ్ల క్రితమే కృష్ణమూర్తి, లలిత విడిపోగా.. పిల్లలతో నగరానికి వచ్చింది. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. ఏడాది నుంచి నిజాంపేట వినాయక్నగర్లోని గ్రేటర్ ఇన్ఫ్రాస్ జువెల్ గ్రాండ్ అపార్ట్మెంట్ తల్లి, కుమారుడు ఉంటున్నారు. కుమారుడికి 35 ఏళ్లు దాటినా పెళ్లి కావట్లేదని దివ్యతో చెప్పి తల్లి కన్నీరు పెట్టుకునేది. దివ్యకు కుమారుడు శివకార్తికేయ (ఏడాదిన్నర) ఉన్నాడు. బుధవారం అర్ధరాత్రి దాటే వరకు తల్లీకూతుళ్లు ఇదే విషయమై మాట్లాడుకున్నారు. తల్లి, కూతురు, మనవడు ఒకగదిలో పడుకున్నారు. మరో గదిలో శ్రీకర్ నిద్రపోయాడు. గురువారం ఉదయం దివ్య.. అన్న శ్రీకర్ గది తలుపుకొట్టి పడిపోయింది. బయటకొచ్చి చూసిన శ్రీకర్.. తల్లి, మేనల్లుడు అచేతనంగా పడి ఉండటంతో కుప్పకూలిపోయాడు. తేరుకొని ఇరుకు పొరుగు సాయంతో దివ్యను సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించాడు. బాచుపల్లి పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
విడిపోయిన తల్లిదండ్రులను మళ్లీ కలపాలనే కన్నవారి సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన శ్రీకర్కు ఉండేది. దీన్ని తల్లి, సోదరి వ్యతిరేకించేవారని సమాచారం. ఈనేపథ్యంలో కుమారుడి పెళ్లి ప్రయత్నాలు విఫలమవటం, కుటుంబంలో తలెత్తిన గొడవలు ఆ అమ్మ మనసును ఉక్కిరిబిక్కిరి చేశాయి. దివ్య కూడా ఆందోళనకు గురైంది. దీంతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. తాము దూరమైతే తన కుమారుడు తల్లి లేని వాడు అవుతాడని దివ్య భావించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక లలిత మనవడి గొంతు నులిమి చంపింది. తరువాత పక్కనే పడుకొని చీర కొంగుతో గొంతు బిగించుకొని ప్రాణాలు తీసుకొంది. దివ్య చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకోగా అది తెగి పడటంతో ఆమె కిందపడి అపస్మారకస్థితికి చేరుకుంది. స్పృహలోకి వచ్చాక అన్నను నిద్రలేపింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు