logo

Andhra News: అత్తపై కూర్చొని.. ముఖాన్ని నేలక్కొట్టి..!

అత్తాకోడళ్ల మధ్య జరిగిన తగాదా ఘర్షణకు దారి తీయడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరికి అత్త ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని రావివలసలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గ్రామానికి చెందిన గుంట్రెడ్డి రాములమ్మ(65)కు

Updated : 13 May 2022 11:35 IST

వివరాలు సేకరిస్తున్న పోలీసులు

గరుగుబిల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: అత్తాకోడళ్ల మధ్య జరిగిన తగాదా ఘర్షణకు దారి తీయడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరికి అత్త ప్రాణాలు కోల్పోయిన ఘటన విజయనగరంలో మండలంలోని రావివలసలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గ్రామానికి చెందిన గుంట్రెడ్డి రాములమ్మ(65)కు నలుగురు కుమారులు. ప్రస్తుతం ఈమె చిన్న కుమారుడు శివకుమార్‌, కోడలు గౌరీశ్వరి వద్ద ఉంటున్నారు. తరచూ అత్త, కోడలు మధ్య తగాదాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. గురువారం ఉదయం ఆర్‌ఎంపీగా చేస్తున్న శివకుమార్‌ పనిమీద బయటకు వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య వాదులాట జరిగింది. ఇంటి లోపల గడియ వేసి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో అత్తను నెట్టి, ఆమెపై కూర్చొని ముఖాన్ని బలంగా పలుమార్లు నేలకు కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ముఖమంతా రక్తసిక్తమై రాములమ్మ అక్కడే ప్రాణాలు కోల్పోయింది. కొంత సేపటికి వచ్చిన శివకుమార్‌ తల్లి రక్తపుమడుగులో ఉండటాన్ని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్వతీపురం డీఎస్పీ, పాలకొండ నుంచి పోలీసు బృందాలు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజేశ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని