Crime News: ప్రియురాలిపై మోజుతో తల్లిని హతమార్చిన దత్తపుత్రుడు..
ప్రియురాలిపై మోజుతో తల్లిని దత్తపుత్రుడు దారుణంగా హత మార్చాడు. అతడి మానసిక స్థితి సరిగా లేదని గమనించిన కారుడ్రైవర్ దత్తపుత్రుడిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి స్నేహితుడితో
ఆపై దత్తపుత్రుడిని నమ్మించి హతమార్చిన కారు డ్రైవర్
మహిళను చంపిన కేసులో ఐదుగురి అరెస్ట్
ఈనాడు, హైదరాబాద్-సరూర్నగర్ క్రైం, న్యూస్టుడే: ప్రియురాలిపై మోజుతో తల్లిని దత్తపుత్రుడు దారుణంగా హత మార్చాడు. అతడి మానసిక స్థితి సరిగా లేదని గమనించిన కారుడ్రైవర్ దత్తపుత్రుడిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి స్నేహితుడితో మట్టుబెట్టించాడు. సంచలనం రేకెత్తించిన భూదేవి(50) అనే మహిళ హత్య కేసులో ఐదుగురు నిందితులు రంగారెడ్డి జిల్లాకు చెందిన కరినాగుల నర్సింహ(24), వి.శివ(23), మహబూబ్నగర్ జిల్లా వాసి ఏ.హర్ష అలియాస్ చింటూ(22), నల్గొండ, వనపర్తి జిల్లాలకు చెందిన బి.సాయిగౌడ్(22), ఏ.ఆంజనేయులు(21)లను శుక్రవారం సరూర్నగర్ పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. పెద్దఎత్తున డబ్బు చేతికి వస్తుందనే ఉద్దేశంతో పక్కా పథకం ప్రకారం రెండు హత్యలు చేసినట్లు సరూర్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవిబాబు తెలిపారు. నిందితుల నుంచి 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.37లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మహిళ హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న సాయితేజ (26) హత్యతో కేసు మిస్టరీ వీడింది.
ప్రియురాలు దూరమవుతుందని.. న్యూ గడ్డిఅన్నారం కాలనీలో జంగయ్య యాదవ్, భూదేవి దంపతులు 1995లో మూడు రోజుల పసికందును దత్తత తీసుకుని సాయితేజ అని పేరు పెట్టారు. పసితనం నుంచే అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవటంతో వైద్యులకు చూపించి మందులు వాడారు. అదే ప్రాంతంలో ఉండే ఓ యువతి (23)తో సాయితేజ ప్రేమలో పడ్డాడు. ఆమెకోసం ఖరీదైన బహుమతులు కొనిచ్చాడు. ఇంట్లో నగలు, నగదు మాయమవుతుండటంతో కొడుకు నిర్వాకం తల్లిదండ్రులకు తెలిసింది. కొడుకును మందలించడంతోపాటు ఆ అమ్మాయిను హెచ్చరించి ఇల్లు ఖాళీ చేయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సాయితేజ తమ వద్ద కారుడ్రైవర్గా పనిచేసి మానేసిన కరినాగుల నర్సింహ అలియాస్ నానితో పంచుకున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పథకం వేసిన నరిం్సహ ఇంట్లో నగలు కాజేసి ప్రియురాలిని పెళ్లిచేసుకొని దూరంగా వెళ్లిపోవచ్చంటూ సలహా ఇచ్చాడు.
సీసీ కెమెరాలకు దొరక్కుండా వ్యూహం.. ఈ నెల 2న సాయితేజ ఇంట్లో డబ్బు ఉందనే విషయం తెలియగానే నర్సింహ తన స్నేహితులు వట్టికోటి శివ, అడ్డాకుల హర్ష, బోయినపల్లి సాయిగౌడ్, అర్కటం ఆంజనేయులుకు సమాచారమిచ్చాడు. డబ్బు కొట్టేసి వాటాలు పంచుకుందామని అశచూపాడు. ఈ నెల 6న అర్ధరాత్రి(7వతేదీ) దాటాక అందరూ న్యూ గడ్డి అన్నారం చేరుకున్నారు. నర్సింహ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల వైర్లను కత్తిరించాడు. ఇంట్లోకి ప్రవేశించి బీరువా పక్కనే నిద్రపోతున్న భూదేవి ముఖంపై దిండు ఉంచి సాయితేజ, శివ ఊపిరాడకుండా చేశారు. సాయిగౌడ్, హర్ష కాళ్లను పట్టుకున్నారు. భూదేవి మరణించినట్టు నిర్ధారించుకున్నాక సొత్తును వాటాలేసుకొని పంచుకున్నారు.
ఎదురు చూస్తోందంటూ నమ్మించి.. హత్య విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు సాయితేజను అడ్డుతొలగించుకోవాలని మిగిలిన నిందితులు భావించారు. దీనిలో భాగంగానే అతడి ప్రేయసి శ్రీశైలంలో ఎదురుచూస్తుందంటూ అతడ్ని నమ్మించిన శివ 7వ తేదీ మధ్యాహ్నం శ్రీశైలం తీసుకెళ్లి సత్రంలో బసచేశారు. మరుసటిరోజు శిరోముండనం చేయించి ఆలయంలో పూజలు చేయించారు. 9న రాత్రి వట్టెవారిపల్లెలో ఉన్నారు. ఏ2 నిందితుడు శివ 10వ తేదీ ఉదయం మల్లెతీర్థం ప్రాంతానికి సాయితేజను తీసుకెళ్లాడు. ఇద్దరూ కలసి మద్యం తాగారు. అనంతరం సాయితేజ తలపై శివ బండరాయితో దాడిచేసి చంపి లుంగీకి రాయి చుట్టి మృతదేహాన్ని నీటిలోకి నెట్టేశాడు. భూదేవి హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న విషయం తెలిసిన శివ ఆందోళనకు గురయ్యాడు. సరూర్నగర్ ఠాణాలో లొంగిపోయాడు. అతడు ఇచ్చిన సమాచారంతో నిందితులను అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ ఏసీపీ పి.శ్రీధర్రెడ్డి, సరూర్నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం, డీఐ రవిబాబు బృందాన్ని సీపీ, డీసీపీలు అభినందించారు.
నా కుమారుడు అమాయకుడు..
హత్యకు గురైన సాయితేజ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతదేహం నగరానికి తీసుకొచ్చేందుకు అనుకూలంగా లేకపోవటంతో అచ్చంపేటలోనే స్థానిక మున్సిపల్ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు జరిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ హంతకుడు అని తెలిసినా తండ్రి జంగయ్యయాదవ్ మాత్రం తన కుమారుడు అమాయకుడు అంటున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
[ 23-04-2024]
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానం పోటెత్తి.. చెయ్యెత్తి జైకొట్టి
[ 23-04-2024]
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
పొరుగు నేతలకే పెద్దపీట
[ 23-04-2024]
గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. -
కొండంత విశ్వాసం
[ 23-04-2024]
చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.c -
4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?
[ 23-04-2024]
రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. -
చరవాణి హ్యాక్ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా
[ 23-04-2024]
మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్కు ‘మీ ఖాతా బ్లాక్ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. -
15 స్ట్రాంగ్ రూముల్లో.. 5వేల ఈవీఎంలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ వెల్లడించారు. -
అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3
[ 23-04-2024]
నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. -
ప్రతిదానికీ ఓ లెక్కుంది..!
[ 23-04-2024]
ఫలితాల వరకు ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
[ 23-04-2024]
నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. -
స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. -
గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
[ 23-04-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రేవంత్రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల
[ 23-04-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. -
సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం
[ 23-04-2024]
జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. -
విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన డీసీఎం దగ్ధం
[ 23-04-2024]
పార్కింగ్ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
[ 23-04-2024]
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. -
సీఎం సుడిగాలి పర్యటన నేడు
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్
[ 23-04-2024]
మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం
[ 23-04-2024]
తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది. అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి
[ 23-04-2024]
జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్ సోమవారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి