Andhra News: తెదేపా జడ్పీటీసీకి తుపాకీతో బెదిరింపు!
హిరమండలం మండలంలో తుపాకీ సంస్కృతి కలకలం రేపుతోంది. మండల స్థాయి ప్రజాప్రతినిధిపైనే ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, ఎస్సై ఎం.మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. హిరమండలం
హోటల్ కౌంటర్లో బుచ్చిబాబుతో మాట్లాడుతున్న అనుమానాస్పద వ్యక్తి
హిరమండలం, న్యూస్టుడే: హిరమండలం మండలంలో తుపాకీ సంస్కృతి కలకలం రేపుతోంది. మండల స్థాయి ప్రజాప్రతినిధిపైనే ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, ఎస్సై ఎం.మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. హిరమండలం జడ్పీటీసీ (తెదేపా) సభ్యుడు పొగిరి బుచ్చిబాబు గొట్టాబ్యారేజీ సెంటరులో అమృత హోటల్ను నడుపుతున్నారు. రాత్రి 9 గంటల సమయంలో వ్యాపార పనుల్లో ఉండగా కూర కొనేందుకని ఓ వ్యక్తి వచ్చి అనుమానాస్పదంగా మాట్లాడి వెళ్లాడు. తర్వాత బుచ్చిబాబు 10 గంటల సమయంలో పనులు ముగించుకొని ఒంటరిగా ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆయన ఇంటి వద్దకు కారులో ముగ్గురు వచ్చి ఉన్నారు. బుచ్చిబాబు వచ్చిన వెంటనే ఇద్దరు వ్యక్తులు కారు దిగి తాము పోలీసులమని, మాట్లాడాల్సి ఉందని, రావాలని డిమాండ్ చేశారు. ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందామని, కారులోకి రానని ఆయన స్పష్టం చేశారు. రాకుంటే ఎన్కౌంటర్ చేస్తామంటూ తుపాకీతో బెదిరించి వాహనంలోకి నెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన తప్పించుకొని ఇంటి ముందు ఉన్న కర్ర తీసి రక్షించుకునే ప్రయత్నం చేశారు. కారులో ఉన్న డ్రైవరు సూచనలతో ఇద్దరూ అక్కడి నుంచి శ్రీకాకుళం వైపు రహదారి మీదుగా పరారయ్యారు. జడ్పీటీసీ సభ్యుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మధుసూదనరావు తెలిపారు.
కారణాలేమిటో..: వెనుకబడిన సిక్కోలు, అందులోనూ ఓ మారుమూల మండలంలో గన్ కల్చర్ స్థానికంగా కలకలం రేపింది. దుండగులు తుపాకీతో బెదిరింపులకు పాల్పడటంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు కారణం రాజకీయ కోణమా లేక ఆర్థిక పరమైన లావాదేవీలా అనేది తేలాల్సి ఉంది. జిల్లాలో తెదేపా నుంచి ఎన్నికైన ఏకైక జడ్పీటీసీ సభ్యుడు బుచ్చిబాబు. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోపక్క స్థానికంగానూ హోటల్ నడుపుతూ వ్యాపారం చేస్తున్నారు. వచ్చినవారు పోలీసులమని చెప్పడం గమనార్హం. వారం రోజుల కిందటే ఇంటికి వెళ్తుండగా రెక్కీ నిర్వహించారని, అప్పట్లో మద్యం దుకాణానికి దారెటని అడిగారని, ఇప్పుడు తన నివాసం వద్దే ఎవరూ లేని సమయంలో బెదిరించారని బుచ్చిబాబు పేర్కొన్నారు.
పొగిరి బుచ్చిబాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)