Andhra News: అనంతపురం జిల్లాలో నకిలీ జాయింట్ కలెక్టర్ హల్చల్
శెట్టూరు మండలంలో జేసీ పేరిట ఓ మహిళ బుధవారం హల్చల్ చేసింది. చింతర్లపల్లి, ములకలేడు, తిప్పనపల్లి సచివాలయాలను తనిఖీ చేసింది. తన పేరు సింధూరి జంపాల అని, సచివాలయాల జేసీగా బాధ్యతలు చేపట్టానంటూ సిబ్బంది హాజరు పట్టిక, బయోమెట్రిక్పై ఆరా తీసింది.
చింతర్లపల్లి సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న సింధూరి
శెట్టూరు, న్యూస్టుడే: అనంతపురం జిల్లా శెట్టూరు మండలంలో జేసీ(జాయింట్ కలెక్టర్) పేరిట ఓ మహిళ బుధవారం హల్చల్ చేసింది. చింతర్లపల్లి, ములకలేడు, తిప్పనపల్లి సచివాలయాలను తనిఖీ చేసింది. తన పేరు సింధూరి జంపాల అని, సచివాలయాల జేసీగా బాధ్యతలు చేపట్టానంటూ సిబ్బంది హాజరు పట్టిక, బయోమెట్రిక్పై ఆరా తీసింది. అనంతరం శెట్టూరు పీహెచ్సీకి వచ్చింది. వైద్యుడి కుర్చీలో కూర్చుని.. సిబ్బంది ఎవరెవరు ఎక్కడి నుంచి విధులకు వస్తున్నది, మందుల నిల్వ వివరాలు అడిగింది. సచివాలయాల సిబ్బంది విషయాన్ని తహసీల్దారు శంకరయ్య, ఎంపీడీవో వెంకటనాయుడు, ఎస్సై యువరాజ్కు చేరవేశారు. వారందరూ పీహెచ్సీకి చేరుకుని ఆమెను ప్రశ్నించారు. జేసీ హోదాతోనే తనిఖీ చేస్తున్నానని, ఎక్కడైనా విచారించుకోండని చెప్పడంతో తహసీల్దార్ కలెక్టరేట్కు ఫోన్ చేశారు. ఆ పేరుతో జేసీ ఎవరూ జాయిన్ కాలేదని చెప్పడంతో నకిలీగా నిర్ధారించుకుని కలెక్టరేట్కు తీసుకెళ్లారు. అక్కడ జేసీ కేతన్గార్గ్ ఆమె వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అనంతరం శెట్టూరుకు తీసుకొచ్చి కేసు నమోదు చేశారు. ఆమె వెంట శెట్టూరు మండలం ములకలేడు ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేసే హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్ ఉన్నారు. ఎస్సై మాట్లాడుతూ సింధూరి సొంతూరు శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురమని, బీఎస్సీ కంప్యూటర్స్ చదివిందని తెలిపారు. గతంలో జిల్లాకేంద్రంలో పదో తరగతి స్క్వాడ్గా, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఓ వైద్యుడిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించిందని, రెండు ప్రైవేటు పాఠశాలలు, బత్తలపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధూప, దీప నైవేద్యం.. జగనాధీనం
[ 23-04-2024]
దేవాలయాలపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. తీసుకోవడమేకానీ.. ఇవ్వడం తెలియదన్నట్లుగా.. ఆలయాల నుంచి వచ్చిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాలో జమ చేసుకున్నారుగాని.. తిరిగి పైసా విదిల్చ లేదు. -
ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’
[ 23-04-2024]
ఇక నుంచి జిల్లా ఎన్నికల మస్కట్గా ‘వేరుసెనగ విత్తనం’ ఆకృతిని అధికారికంగా గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్ వినోద్కుమార్ ప్రకటించారు. ఉత్తమ ఎన్నికల మస్కట్ పోటీల వివరాలను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకటించారు. -
ఊపందుకున్న నామినేషన్లు
[ 23-04-2024]
జిల్లాలో సోమవారం 37 సెట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో అనంత లోక్సభకు 7 ఎనిమిది, అసెంబ్లీ స్థానాలకు 30 సెట్ల ప్రకారం నామినేషన్లు వచ్చాయి. -
పదిలో 24వ స్థానం
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా వెనుకబడింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 24వ స్థానానికి పరిమితమైంది. 80.93 శాతం ఉత్తీర్ణత సాధించినా జిల్లాల వారీగా పరిశీలిస్తే చివరన ఉంది. -
గ్రానైట్ పరిశ్రమలపై గునపం
[ 23-04-2024]
చంద్రబాబు ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమలపై రాయితీ విపరీతంగా పెంచేసింది. రూ.2,300 ఉన్న రాయల్టీని వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిస్తాం. కరెంటు ఛార్జీల భారం లేకుండా చేస్తాం. పెద్దఎత్తున రాయితీ ఇచ్చి కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాం. -
ఆస్తి పాస్తులు
[ 23-04-2024]
అభ్యర్థి: కాలవ శ్రీనివాసులు -
తోయండి.. ఇది జగన్మొండి
[ 23-04-2024]
వైకాపా ఐదేళ్ల నిర్లక్ష్య పాలన.. ఉరవకొండ ఆర్టీసీ డిపో అధికారుల వైఖరి కారణంగా తరచూ బస్సులు నడి రోడ్డుపై ఆగిపోతున్నాయి. కళ్యాణదుర్గం నుంచి ఉరవకొండకు వస్తున్న పల్లె వెలుగు బస్సు పట్టణంలోని ప్రధాన రహదారిపై డిపో సమీపంలో గేర్లు పడక ఆగిపోయింది. -
బోధించడం పాపమా.. గురువులపై క్రూరత్వమా?
[ 23-04-2024]
నవ సమాజ నిర్మాతలు గురువులు.. ఎందుకో జగన్కు వీరంటేనే గిట్టదు. తనకు విద్యాబుద్ధులు నేర్పిందీ ఒక గురువే అన్న జ్ఞానాన్ని విస్మరించి.. వారిని శత్రువుల్లా చూస్తూ దండెత్తుతున్నాడు. -
‘అనంత’కు కలిసిరాని నాయకగణం
[ 23-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నాయకగణం కలిసి రాలేదు. ఇన్నాళ్లు ఎడ మొహం పెడ మొహంతో ఉన్నా నామినేషన్ సమయానికి అంతా కలిసి వస్తారని చెప్పుకొంటూ వచ్చారు. కానీ అదేం జరగలేదు. -
అరాచక ప్రభుత్వాన్ని సాగనంపండి: కేశవ్
[ 23-04-2024]
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఐదేళ్లుగా అరాచక పాలన సాగించిందని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
భర్తీలో వెనుకబాటు.. పాలన నగుబాటు
[ 23-04-2024]
విద్యుత్తు శాఖ సెక్షన్ కార్యాలయాల్లో ఏఈలు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఎస్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల నియామకం చేపట్టకపోవటంతో క్షేత్రస్థాయిలో ఏఈ పోస్టులు ఎక్కువ ఖాళీలు ఏర్పడ్డాయి. -
పదో తరగతి ఫలితాల్లో విద్యార్థుల సత్తా
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. కళ్యాణదుర్గం మండలంలో 69.12శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 27మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. -
ధర్మవరంలో వైకాపాకు ఝలక్
[ 23-04-2024]
ధర్మవరం నియోజకవర్గంలో వైకాపాలో బీసీ నాయకులుగా మెలిగిన వారు ఆ పార్టీకే ఝలక్ ఇస్తున్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితో విభేదాలున్న నాయకులు ఒక్కొక్కొరు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
తెదేపాతో అర్హులందరికీ సంక్షేమం: సునీత
[ 23-04-2024]
తెదేపాలో చేరిన వారు భయపడాల్సిన పనిలేదు. పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని మాజీ మంత్రి పరిటాల సునీత భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!