logo

TDP Mahanadu: ఒంగోలులో మహానాడు.. వాహనాల మళ్లింపు ఇలా..

ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో తెదేపా మహానాడు నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మలికాగార్గ్‌ తెలిపారు.

Published : 27 May 2022 08:37 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో తెదేపా మహానాడు నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మలికాగార్గ్‌ తెలిపారు.

ఇలా రావచ్ఛు.: గుంటూరు, విజయవాడ, చీరాల వైపు నుంచి మహానాడుకు వచ్చే వాహనాలు త్రోవగుంట పై వంతెన ఎక్కకుండా బై లైన్‌ సర్వీసు రోడ్డులోకి వచ్చి కిమ్స్‌ అండర్‌ పాస్‌ ద్వారా విష్ణుప్రియ కల్యాణమండపం మీదుగా పార్కింగ్‌ ఏరియాకు వెళ్లి అక్కడి నుంచి సమావేశ ప్రాంగణానికి చేరుకోవాలి.

నెల్లూరు, కావలి వైపు నుంచి వచ్చేవి ఒంగోలు నగరంలోకి ప్రవేశించకుండా పెళ్లూరు పై వంతెన ఎక్కి కిమ్స్‌ ఫ్లై ఓవర్‌ వద్ద సర్వీసు రోడ్డు నుంచి కిమ్స్‌ అండర్‌పాస్‌ మీదుగా మహానాడుకు వెళ్లాలి.

కడప, కర్నూల్‌, చీమకుర్తి వైపు నుంచి వచ్చేవి కర్నూల్‌ బైపాస్‌ సెంటరు మీదగా సర్వీసు రోడ్డు ద్వారా ప్రాంగణానికి వెళ్లాల్సి ఉంటుంది.

కొత్తపట్నం వైపు నుంచి వచ్చేవి కిమ్స్‌ పై వంతెన పక్కన సర్వీసు రోడ్డు మీదగా చేరుకోవచ్ఛు

విజయవాడ, గుంటూరు, చీరాల వైపు నుంచి ఒంగోలులోకి ప్రవేశించే వాహనాలు కిమ్స్‌ పై వంతెన మీదుగా కొప్పోలు సర్వీసు రోడ్డు, కొత్తపట్నం బస్టాండ్‌ నుంచి ఒంగోలులోకి ప్రవేశించవచ్ఛు

బయటకు వెళ్లాలిలా..: మహానాడు నుంచి తిరిగి గుంటూరు, విజయవాడ వైపు వెళ్లడానికి జాతీయ రహదారి ఎడమవైపు నుంచి ప్రధాన రహదారిలోకి ప్రవేశించి త్రోవగుంట పై వంతెన ఎక్కి వెళ్లాలి. చీరాల వైపు వెళ్లే వాహనాలు త్రోవగుంట పైవంతెన అండర్‌ పాస్‌ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కావలి, నెల్లూరు వైపు వెళ్లేవి పార్కింగ్‌ ప్రాంతం నుంచి త్రోవగుంట ఫ్లై ఓవర్‌ అండర్‌ పాస్‌ నుంచి యూ టర్న్‌ తీసుకొని జాతీయ రహదారిలోకి ప్రవేశించి నెల్లూరులోకి వెళ్లాలి. కర్నూల్‌, కడప, చీమకుర్తి వైపు వెళ్లేవి త్రోవగుంట అండర్‌ పాస్‌ నుంచి కిమ్స్‌ పైవంతెన ఎక్కి పెళ్లూరు ఫ్లై ఓవర్‌ దిగి ఒంగోలు మినీ బైపాస్‌ మీదుగా కర్నూల్‌, కడప మార్గంలోకి వెళ్లాలి. ● ఒంగోలు నగరం నుంచి గుంటూరు, విజయవాడ వెళ్లేవి కొత్తపట్నం బస్టాండ్‌ నుంచి కొప్పోలు పైవంతెనకు ఎడమ వైపు సర్వీసు రోడ్డు నుంచి 16వ నెంబర్‌ జాతీయ రహదారి మీదకు చేరుకోవాలి. కావలి, నెల్లూరు వైపు వెళ్లాల్సినవి దక్షిణ బైపాస్‌.. రమేష్‌ సంఘమిత్ర వైద్యశాల మీదుగా పెళ్లూరు అండర్‌ పాస్‌ మీదుగా జాతీయ రహదారిపై వెళ్లాలి. చీరాల వైపు వెళ్లేవారు కొత్తపట్నం బస్టాండ్‌ మీదుగా కొప్పోలు ఫ్లై ఓవర్‌కు ఎడమ వైపు సర్వీసు రోడ్డు ద్వారా 16వ నెంబర్‌ జాతీయ రహదారికి వెళ్లి త్రోవగుంట అండర్‌ పాస్‌ ద్వారా ప్రయాణించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని