TDP Mahanadu: ఒంగోలులో మహానాడు.. వాహనాల మళ్లింపు ఇలా..
ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో తెదేపా మహానాడు నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మలికాగార్గ్ తెలిపారు.
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో తెదేపా మహానాడు నేపథ్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మలికాగార్గ్ తెలిపారు.
ఇలా రావచ్ఛు.: గుంటూరు, విజయవాడ, చీరాల వైపు నుంచి మహానాడుకు వచ్చే వాహనాలు త్రోవగుంట పై వంతెన ఎక్కకుండా బై లైన్ సర్వీసు రోడ్డులోకి వచ్చి కిమ్స్ అండర్ పాస్ ద్వారా విష్ణుప్రియ కల్యాణమండపం మీదుగా పార్కింగ్ ఏరియాకు వెళ్లి అక్కడి నుంచి సమావేశ ప్రాంగణానికి చేరుకోవాలి.
నెల్లూరు, కావలి వైపు నుంచి వచ్చేవి ఒంగోలు నగరంలోకి ప్రవేశించకుండా పెళ్లూరు పై వంతెన ఎక్కి కిమ్స్ ఫ్లై ఓవర్ వద్ద సర్వీసు రోడ్డు నుంచి కిమ్స్ అండర్పాస్ మీదుగా మహానాడుకు వెళ్లాలి.
కడప, కర్నూల్, చీమకుర్తి వైపు నుంచి వచ్చేవి కర్నూల్ బైపాస్ సెంటరు మీదగా సర్వీసు రోడ్డు ద్వారా ప్రాంగణానికి వెళ్లాల్సి ఉంటుంది.
కొత్తపట్నం వైపు నుంచి వచ్చేవి కిమ్స్ పై వంతెన పక్కన సర్వీసు రోడ్డు మీదగా చేరుకోవచ్ఛు
విజయవాడ, గుంటూరు, చీరాల వైపు నుంచి ఒంగోలులోకి ప్రవేశించే వాహనాలు కిమ్స్ పై వంతెన మీదుగా కొప్పోలు సర్వీసు రోడ్డు, కొత్తపట్నం బస్టాండ్ నుంచి ఒంగోలులోకి ప్రవేశించవచ్ఛు
బయటకు వెళ్లాలిలా..: మహానాడు నుంచి తిరిగి గుంటూరు, విజయవాడ వైపు వెళ్లడానికి జాతీయ రహదారి ఎడమవైపు నుంచి ప్రధాన రహదారిలోకి ప్రవేశించి త్రోవగుంట పై వంతెన ఎక్కి వెళ్లాలి. చీరాల వైపు వెళ్లే వాహనాలు త్రోవగుంట పైవంతెన అండర్ పాస్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. కావలి, నెల్లూరు వైపు వెళ్లేవి పార్కింగ్ ప్రాంతం నుంచి త్రోవగుంట ఫ్లై ఓవర్ అండర్ పాస్ నుంచి యూ టర్న్ తీసుకొని జాతీయ రహదారిలోకి ప్రవేశించి నెల్లూరులోకి వెళ్లాలి. కర్నూల్, కడప, చీమకుర్తి వైపు వెళ్లేవి త్రోవగుంట అండర్ పాస్ నుంచి కిమ్స్ పైవంతెన ఎక్కి పెళ్లూరు ఫ్లై ఓవర్ దిగి ఒంగోలు మినీ బైపాస్ మీదుగా కర్నూల్, కడప మార్గంలోకి వెళ్లాలి. ● ఒంగోలు నగరం నుంచి గుంటూరు, విజయవాడ వెళ్లేవి కొత్తపట్నం బస్టాండ్ నుంచి కొప్పోలు పైవంతెనకు ఎడమ వైపు సర్వీసు రోడ్డు నుంచి 16వ నెంబర్ జాతీయ రహదారి మీదకు చేరుకోవాలి. కావలి, నెల్లూరు వైపు వెళ్లాల్సినవి దక్షిణ బైపాస్.. రమేష్ సంఘమిత్ర వైద్యశాల మీదుగా పెళ్లూరు అండర్ పాస్ మీదుగా జాతీయ రహదారిపై వెళ్లాలి. చీరాల వైపు వెళ్లేవారు కొత్తపట్నం బస్టాండ్ మీదుగా కొప్పోలు ఫ్లై ఓవర్కు ఎడమ వైపు సర్వీసు రోడ్డు ద్వారా 16వ నెంబర్ జాతీయ రహదారికి వెళ్లి త్రోవగుంట అండర్ పాస్ ద్వారా ప్రయాణించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు