IND Vs SA: విజయమో..వీర పోరాటమో!
విశాఖలో జరిగే మ్యాచ్ భారత్కు కీలకం. ఓడిపోతే టీ-20 సిరీస్ దక్షిణాఫ్రికా సొంతమవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే సంకల్పంతో భారత క్రికెటర్లు ఉన్నారు. మరో వైపు వరుసగా రెండు విజయాలతో దక్షిణాఫ్రికా జట్టు దూకుడుగా
నేడే... క్రికెట్ సమరం
కలిసొచ్చే మైదానం.. భారత్ అదరగొట్టేనా..!
కీలకంగా మారిన విశాఖ టీ-20 మ్యాచ్
స్టేడియం వెలుపల విద్యుద్దీపాల వెలుగులు
విశాఖ క్రీడలు, న్యూస్టుడే: విశాఖలో జరిగే మ్యాచ్ భారత్కు కీలకం. ఓడిపోతే టీ-20 సిరీస్ దక్షిణాఫ్రికా సొంతమవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే సంకల్పంతో భారత క్రికెటర్లు ఉన్నారు. మరో వైపు వరుసగా రెండు విజయాలతో దక్షిణాఫ్రికా జట్టు దూకుడుగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. విశాఖ స్టేడియం భారత జట్టుకు కలిసొచ్చిన పిచ్గా గుర్తింపు పొందింది. ఇక్కడ ఆడిన మ్యాచ్ల్లో (వన్డేలు, టెస్ట్లు) అత్యధిక విజయాలు సొంతం చేసుకుంది. దీంతో భారత క్రికెటర్లలో, అభిమానుల్లో ఇక్కడ మ్యాచ్ అంటే గెలుపు నల్లేరు మీద నడకేనని అభిప్రాయపడుతుంటారు. మంగళవారం మ్యాచ్కు సంబంధించి ఇప్పటికే పిచ్ సిద్ధమైంది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 200పైగా పరుగులు సాధించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
టీ-20లో మిశ్రమ ఫలితాలు: గతంలో విశాఖ స్టేడియంలో మూడు టీ-20 మ్యాచ్లు జరిగాయి. ఒకటి భారత్ గెలవగా, ఒకటి ఓడిపోయింది.మరొకటి రద్దయింది. 2012 సెప్టెంబరు 8న భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ వర్షానికి రద్దయింది. 2016 ఫిబ్రవరి 14న భారత్- శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2019 ఫిబ్రవరి 24న భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మంగళవారం జరగనున్న భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ నాలుగోది. ఇందులో ఎవరు విజయం సాధిస్తారో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
* సోమవారం సాయంత్రం భారత్-దక్షిణాఫ్రికా క్రికెటర్లు నగరానికి చేరుకున్నారు. రుషికొండ బీచ్ సమీపంలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేశారు. దీంతో పోలీసులు అడుగడుగునా భద్రత కట్టుదిట్టం చేశారు. పీఎంపాలెం ఏసీఏ, వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ట్రాఫిక్, గ్యాలరీలు, స్టాండ్లు, క్రీడాకారులకు రక్షణ, స్టేడియం ప్రధానగేట్లు, క్రికెటర్ల డ్రెస్సింగ్ గదులు తదితర ప్రదేశాల్లో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మ్యాచ్ సజావుగా సాగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
విమానాశ్రయంలో భారత క్రీడాకారులు
1487 మంది పోలీసులతో భద్రత
ఎం.వి.పి.కాలనీ, న్యూస్టుడే : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే టీ-20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ ఇప్పటికే దీనిపై తగు సూచనలు ఇచ్చారు. నగరంలో మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మ్యాచ్ను తిలకించేందుకు వచ్చే ప్రేక్షకులు... తిరిగి ఇళ్లకు పయనమయ్యే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 1,487 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దించారు.
* ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు 9 పోలీసు పార్టీలను నియమించారు. ఒక ఆక్టోపస్ బృందం, 10 యాంటీ సబాటేజ్ చెక్ పాయింట్లు, 42 యాక్సిస్ కంట్రోల్ బృందాలు, 5 పోలీసు కుక్కలతో కూడిన బృందం, 15 ఎ.ఆర్.సెక్షన్లు, 2 స్పెషల్ పార్టీలను నియమించారు. విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, తూ.గో. జిల్లాల నుంచి పోలీసు బృందాలు నగరానికి చేరుకున్నాయి.
* స్టేడియంలోకి ఎలాంటి మంచినీటి సీసాలు, ఆహార పదార్థాలను అనుమతించరని పోలీసులు స్పష్టం చేశారు. ప్రేక్షకుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతున్న 100 బస్సు సర్వీసులను వినియోగించుకోవాలని పోలీసు కమిషనర్ శ్రీకాంత్ కోరారు. మ్యాచ్ అనంతరం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే సమయంలో ప్రతీ ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో మాఫియాల స్వైర విహారం: కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్
[ 24-04-2024]
ఏపీ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్రం సహకరిస్తుంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మాత్రం లెక్కకు మించి అప్పులు చేసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. -
బస్సులో సీఎం... ఎండలో జనం
[ 24-04-2024]
సీఎం జగన్ మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ బస్సుయాత్ర ప్రజలకు చుక్కలు చూపించింది. మంగళవారం పీఎం పాలెం స్టేడియం వద్దకు సీఎం వచ్చి మాట్లాడతారని వైకాపా నేతలు జనాన్ని ఆటోల్లో తరలించారు. -
జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
[ 24-04-2024]
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే. -
పునరావాసం.. పచ్చి మోసం
[ 24-04-2024]
పదిమంది బాగు కోసం, పారిశ్రామికాభివృద్ధి కోసం భూమిని, భుక్తిని త్యాగం చేసిన నిర్వాసితులకు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. -
విశాఖ-చెన్నై ఎగ్మోర్ మధ్య ప్రత్యేక రైలు
[ 24-04-2024]
రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
యువతా.. ఓటుకు తరలిరండి..
[ 24-04-2024]
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సుకు స్పందన లభించింది. -
కూపన్లపై పెట్రోలు, డీజిల్ పోయడం కోడ్ ఉల్లంఘనే: జేసీ
[ 24-04-2024]
రాజకీయ పార్టీలు జారీ చేసే కూపన్ల ఆధారంగా పెట్రోలు, డీజిల్ పోస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయా పెట్రోలు బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. -
సీఎం గారూ... మీ ఇళ్లు ఇలాగే కట్టారా?
[ 24-04-2024]
జగనన్న కాలనీల పేరిట వేలాది ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామని లేనిపోని హామీలు గుప్పించిన సీఎం జగన్ పాలకు ఐదేళ్లయింది. -
కోలాహలంగా విష్ణుకుమార్రాజు నామినేషన్
[ 24-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి(భాజపా) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు నామినేషన్ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. భాజపా, తెదేపా, జనసేన పార్టీల నుంచి వందలాది మంది కార్యకర్తలతో సీతమ్మధార భాజపా కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. -
జగనన్న వస్తే తప్పని తిప్పలు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర మధురవాడ ప్రాంత వాసులకు నరకం చూపించింది. మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో బస చేసిన శిబిరం నుంచి ఉదయం 9 గంటలకు స్టేడియం వద్దకు జగన్ వస్తారని షెడ్యూల్లో తెలిపారు. -
కూటమితోనే అన్నివర్గాలకు భవిష్యత్తు: తెదేపా
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా కూటమి అధికారంలోకి వస్తేనే..సమాజంలో అన్నివర్గాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ అన్నారు. -
విశాఖ లోక్సభ స్థానానికి మూడు నామపత్రాలు
[ 24-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి మంగళవారం ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పి.సత్యనారాయణరెడ్డి, నవతరం పార్టీ నుంచి గండికోట రాజేష్, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ల శ్రావణి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మల్లికార్జునకు నామపత్రాలు అందజేశారు. -
సోషల్ మీడియా సమావేశంలో ‘పారిశుద్ధ్య’ ఉద్యోగి
[ 24-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆనందపురంలో మంగళవారం నిర్వహించిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో 20వ వార్డుకు చెందిన పొరుగుసేవల విధానంలో పని చేస్తున్న శానిటరీ ఉద్యోగి పాల్గొనటం విశేషం. -
మాట తప్పారు.. మడమ తిప్పారు..
[ 24-04-2024]
రాష్ట్రంలో మద్యాన్ని ఐదు నక్షిత్రాల హోటళ్లకే పరిమితం చేసి, అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపుతానని గత ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారు. -
ఐదుగురు ఆర్పీల తొలగింపు.. ఇద్దరు సీఓల సస్పెన్షన్
[ 24-04-2024]
ఓటర్ల వివరాలను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు డ్వాక్రా ఆర్పీ (రిసోర్స్పర్సన్)లను తొలగిస్తూ మంగళవారం కలెక్టర్ మల్లికార్జున ఉత్తర్వులిచ్చారు. -
బకాయిల ‘దీవెన’ పేదల వేదన..!
[ 24-04-2024]
జగనన్నమాట: చదువుల కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదని ‘విద్యా దీవెన’ పథకాన్ని ప్రవేశపెట్టాం. -
జగన్ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి
[ 24-04-2024]
ఐదేళ్లగా జగన్ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. -
వైకాపా సోషల్ మీడియా సమావేశంలో వాలంటీర్లు
[ 24-04-2024]
ఎన్నికల విధుల్లో, రాజకీయ పార్టీల తరఫున ప్రచారాలు, సమావేశాల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా వాలంటీర్లు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. -
మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలి
[ 24-04-2024]
ఎన్నికలకు ముందు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించిన వైకాపాకు గుణపాఠం చెప్పాలని పేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థిని వంగలపూడి అనిత కోరారు. -
‘కేంద్రంలో మీ మద్దతు ఎవరికో చెప్పగలరా?’
[ 24-04-2024]
అనకాపల్లి నుంచి వైకాపా ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బూడి ముత్యాలనాయుడు గెలిస్తే కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో ఆయన లేదా సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పగలరా అని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ప్రశ్నించారు. -
‘బినామీ పేర్లతో ముఖ్యమంత్రి దోపిడీ’
[ 24-04-2024]
ఒక్క అవకాశం అంటూ తండ్రి ఫొటో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ బినామీ పేర్లతో అధిక ధరలకు కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు, సంపదను దోచుకుతింటున్నారని జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..