నిమిషాల్లో ఓఆర్ఆర్పైకి!
ఐటీ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించే వంతెనల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. పెరగనున్న ఉద్యోగులు, వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్సార్డీపీ) కింద మరిన్ని పైవంతెనలు,
ఐటీ నగరిలో వేగంగా పైవంతెనల నిర్మాణం
శిల్పా లేఅవుట్ పైవంతెన
ఈనాడు, హైదరాబాద్: ఐటీ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించే వంతెనల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. పెరగనున్న ఉద్యోగులు, వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్సార్డీపీ) కింద మరిన్ని పైవంతెనలు, అండర్పాస్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఐకియాకు పక్కగా డెలాయిట్ సంస్థ వెనుక వైపునున్న రోడ్డును 120 అడుగుల మేర విస్తరించి ఎత్తైన భవనాల మధ్య నుంచి గచ్చిబౌలి ఓఆర్ఆర్ పైకి పైవంతెన నిర్మాణమవుతోంది. పనులు 90 శాతం పూర్తయ్యాయి. ‘వై’ ఆకారంలో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణం.. గచ్చిబౌలి పైవంతెన మీదుగా వెళ్లి ఓఆర్ఆర్కు రెండువైపులా నేలకు తాకుతుంది. మైండ్స్పేస్ కూడలి, హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఐటీ సంస్థలు, నివాస సముదాయాల నుంచి 5 నిమిషాల్లో ఓఆర్ఆర్ను చేరుకునేలా ఈ నిర్మాణం ఉపయోగపడుతుంది. ఆగస్టు 15కు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం.
ఓఆర్ఆర్ నుంచి బొటానికల్ గార్డెన్ వైపు.. శిల్పా లేఅవుట్ పైవంతెనతోపాటు ఓఆర్ఆర్ నుంచి బొటానికల్ గార్డెన్ వైపు మరో పైవంతెన నిర్మాణమవుతోంది. ఆరు లైన్ల వెడల్పుతో నిర్మాణమయ్యే ఈ పైవంతెనపై రెండు వైపులా రాకపోకలుంటాయి. ఓఆర్ఆర్ నుంచి బొటానికల్ గార్డెన్, కొండాపూర్, మియాపూర్ మధ్య రాకపోకలు సాగించే వారికి ఈ నిర్మాణం ఉపయోగపడుతుంది. పనులు పూర్తయ్యేందుకు రెండేళ్లు పడుతుందని అంచనా.
కొత్తగూడ కూడలిపై.. గచ్చిబౌలి నుంచి కొండాపూర్, మియాపూర్ వెళ్లే వాహనాల కోసం జీహెచ్ఎంసీ కొత్తగూడ కూడలి వద్ద పైవంతెనను నిర్మిస్తోంది. ఇది ఎస్ఎల్ఎన్ టెర్మినల్స్ వద్ద, బొటానికల్ గార్డెన్ కూడలికి ముందు మొదలై కొత్తగూడ కూడలి మీదుగా కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వరకు సాగుతుంది. బొటానికల్ గార్డెన్ రోడ్డు మీదుగా వచ్చి కొండాపూర్, మియాపూర్ వెళ్లే వాహనాలూ ఈ వంతెనను ఉపయోగించుకునేలా అప్ ర్యాంపు నిర్మిస్తున్నారు. పనులు దాదాపు తుది దశకు వచ్చాయి. ఈ వంతెన ఎక్కిన వాహనాలు శిల్పారామం రోడ్డుపైకి కూడా దిగొచ్చు. అందుకోసం కొత్తగూడ కూడలిలో డౌన్ ర్యాంపు నిర్మాణమవుతోంది. ఇక మియాపూర్, కొండాపూర్ నుంచి గచ్చిబౌలి, ఓఆర్ఆర్ వెళ్లే వాహనాల కోసం కొత్తగూడ కూడలిలో అండర్పాస్ నిర్మాణమైంది. మొత్తం ప్రాజెక్టు మరో 2 నెలల్లో పూర్తవనుందని ఇంజినీర్లు చెబుతున్నారు.
నెలలో కైత్లాపూర్ ఆర్వోబీ.. కూకట్పల్లి, బోయినపల్లి, మూసాపేట ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ మధ్య రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ కష్టాలు తొలగించే కైత్లాపూర్ ఆర్వోబీ నిర్మాణ పనులు వచ్చే నెలలో పూర్తికానున్నట్లు ఇంజినీర్లు తెలిపారు.
నిర్మాణాల వ్యయం
* బొటానికల్ గార్డెన్-కొత్తగూడ కూడలిపై నిర్మించే పైవంతెన: రూ.263 కోట్లు
* శిల్పాలేఅవుట్ పైవంతెన: 225.50 కోట్లు
* ఓఆర్ఆర్-బొటానికల్ గార్డెన్ రోడ్డు పైవంతెన: రూ.209.5 కోట్లు
* కైత్లాపూర్ ఆర్వోబీ: రూ.83.06 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది