logo

భార్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య

చావులోనూ ఆ జంట ఒకటైంది. అనారోగ్యంతో మృతి చెందిన భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఉరివేసుకున్నాడు. ఈ సంఘటన బెంగళూరు నగరానికి సమీపంలోని దేవనహళ్లి తాలూకా బూదిగెరె గ్రామంలో చోటుచేసుకున్నట్లు గురువారం పోలీసులు వెల్లడించారు.

Published : 28 Jan 2022 01:29 IST

విజయేంద్ర, లావణ్య (పాతచిత్రం)

బెంగళూరు (ఎలక్ట్రానిక్‌ సిటీ), న్యూస్‌టుడే : చావులోనూ ఆ జంట ఒకటైంది. అనారోగ్యంతో మృతి చెందిన భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఉరివేసుకున్నాడు. ఈ సంఘటన బెంగళూరు నగరానికి సమీపంలోని దేవనహళ్లి తాలూకా బూదిగెరె గ్రామంలో చోటుచేసుకున్నట్లు గురువారం పోలీసులు వెల్లడించారు. మృతులను లావణ్య (30), విజయేంద్ర(32)గా గుర్తించారు. వీరికి తొమ్మిదేళ్ల కిందటే వివాహమైంది. సంతానం లేనప్పటికీ అన్యోన్యంగా ఉండేవారు. అనారోగ్యం కారణంగా లావణ్య గురువారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త విజయేంద్ర ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నరాయపట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని