అంజనాద్రిపై సర్వత్రా ఆసక్తి
దశాబ్దకాలం కిందటి వరకు ఆ ప్రాంతం స్థానికులకు మాత్రమే పరిచయం. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన అలనాటి విజయనగర సామ్రాజ్య రాజధాని నగరమైన హంపీకి కూత వేటు దూరంలో ఉన్న అంజనాద్రికి రామాయణ కాలంతో విడదీయరాని
దిగువన నిర్మించనున్న హనుమ క్షేత్రం ఊహాచిత్రం
బెంగళూరు (ఎలక్ట్రానిక్ సిటీ), న్యూస్టుడే: దశాబ్దకాలం కిందటి వరకు ఆ ప్రాంతం స్థానికులకు మాత్రమే పరిచయం. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన అలనాటి విజయనగర సామ్రాజ్య రాజధాని నగరమైన హంపీకి కూత వేటు దూరంలో ఉన్న అంజనాద్రికి రామాయణ కాలంతో విడదీయరాని అనుబంధం ఉంది. రామాయణంలో ప్రధాన ఘట్టమైన సీతాపహరణ సందర్భంలో శ్రీరామచంద్రుడితో స్నేహం చేసిన హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే. అయోధ్యలో రామాలయం రూపుదిద్దుకుంటున్న సమయంలో శ్రీరామ బంటు హనుమ జన్మస్థలమైన అంజనాద్రిని అదే స్థాయిలో అభివృద్ధి చేయాలనేది భక్తుల ఆశయం. ఈ దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. సి.పి.యోగీశ్వర్ పర్యాటక మంత్రిగా ఉన్న సమయంలో అంజనాద్రి అభివృద్ధికి బృహత్ ప్రణాళికను రూపొందించారు. ఈ మహా గిరిధామాన్ని చేరుకునేందుకు తీగ మార్గం ఏర్పాటు, కొండపైన వివిధ అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు అప్పట్లో వెల్లడించారు. పనులన్నింటికీ రూ.500 కోట్ల వరకు వ్యయం అవుతాయని అంచనా. ఇటీవల హుబ్బళ్లిలో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశంలో అంజనాద్రి అభివృద్ధి అంశం ప్రముఖంగా చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కొండ అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించాలనే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రధాని రాష్ట్రాన్ని సందర్శించే అవకాశాలున్న నేపథ్యంలో- ఆ సమయంలోనే అంజనాద్రి అభివృద్ధి పనులను ఆయనతోనే ప్రారంభించాలనే ఆలోచనలో కమలనాథులున్నట్లు సమాచారం. అంజనాద్రిని ప్రధాని సందర్శించేందుకు పరిస్థితులు అనుకూలించని పక్షంలో వర్చువల్ ద్వారా ఆ ప్రక్రియను చేపట్టాలని ఆలోచిస్తున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఇంకా ఎలాంటి తుదినిర్ణయం తీసుకోనప్పటికీ ప్రయత్నాలు మాత్రం కొనసాగుతున్నాయని పార్టీ నాయకులు తెలిపారు.అంజనాద్రి దిగువన హనుమాన్ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో 216 మీటర్ల హనుమంతుడి విగ్రహాన్ని నెలకొల్పడంతో పాటు దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో రామాయణ థీమ్ పార్క్ను అభివృధ్ధి చేయాలని సంకల్పించారు. ఈ పనులన్నీ పూర్తయితే అంజనాద్రి ఓ అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.
గిరిధామం పైనుంచి చూస్తే కనిపించే తుంగభద్ర నది
హంపీ సమీపంలోని అంజనాద్రి గిరిధామం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్