కల్యాణ వేదిక.. శ్మశాన మౌనం
మరికొన్ని గంటలు గడిస్తే.. అక్కడ కల్యాణ వైభోగమే! విధి వారిపై చిన్నచూపుచూసింది. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన రిసెప్షన్కు సింగారించిన మల్లెలు ఇంకా తాజాగా ఉండగానే అవి శాశ్వతంగా వాడిపోయేలా పెళ్లి నిలిచిపోయింది.
ఆత్మీయుల మృతితో శోకసంద్రం
తొమ్మిది మందిని పొట్టన పెట్టుకుని శిథిలమై మిగిలిన జీపు ఇదే
ప్రమాదంలో సన్నిహితులను, ఆత్మీయులను కోల్పోయిన వరుడు మంజునాథ్ తీవ్రంగా కుంగిపోయారు. ధార్వాడ సమీపంలోని నిగది గ్రామంలో ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రమాదం గురించి ఆయన నోట మాట పెగల్లేదు క్షతగాత్రులు చికిత్స పొందుతున్న కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం బంధువుల రోదనలతో హృదయ విదారకంగా మారింది.
ధార్వాడ జిల్లా పోలీసు అధికారి కృష్ణకాంత్ ఇతర ఉన్నతాధికారులు దుర్ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి శంకర పాటీల మునేనకొప్ప పరామర్శించారు.
అతివేగం వద్దని వారించాను. శరవేగంగా వెళ్లడం మంచిది కాదని తాను డ్రైవర్ను వారించినట్లు వాహనంలో మూడో వరుసలో కూర్చున్న మహాదేవి హులమని అనే బంధువు తెలిపారు. తాను ఎన్నిసార్లు హెచ్చరించినా డ్రైవర్ వినలేదని వాపోయారు. భీకర శబ్దం వినిపించిందని.. ఆపై ఏమి జరిగిందో తనకు తెలియదన్నారు. స్పృహ వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నానని వివరించారు.
వరుడు మంజునాథ్ మాట్లాడుతూ రిసెప్షన్కు తమ గ్రామం నుంచి వివిధ వాహనాల్లో 40 మంది బంధువులు వెళ్లామని, అనుకోని దుర్ఘటన సంభవించి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని కన్నీరు మున్నీరయ్యారు. తాము ముందు బయలుదేరిన వాహనంలో క్షేమంగా ప్రయాణించినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిందని తెలుసుకుని బాడ గ్రామానికి వెళ్తే ఆ ప్రాంతమంతా తమవారి శవాలు కనిపించాయని వాపోయారు.
ధార్వాడ తాలూకా బాడ గ్రామం వద్ద క్రూసర్ జీపు చెట్టును
ఢీకొనడంతో గాయపడిన వారికి హుబ్బళ్లి ఆస్పత్రిలో వైద్యసేవలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
బెంగళూరు ఉత్తరలో ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.