ఇనుప ఖనిజం ఎగుమతికి అనుమతి
బళ్లారి, చిత్రదుర్గం, తుమకూరు జిల్లాల నుంచి ఇనుప ఖనిజం ముడిసరకు ఎగుమతికి అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో గనుల ఖిల్లా అఖండ బళ్లారి జిల్లాలో మళ్లీ ఉపాధి అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి. 2011లో కేంద్రం సిఫార్సు మేరకు ఈ మూడు జిల్లాలో గనుల కార్యకలాపాలను సుప్రీం కోర్టు నిలిపివేసింది
కార్మికులకు ఉపాధి అవకాశాలు
సండూరులోని ఓ గనుల ప్రాంతం (పాతచిత్రం)
కేంద్రం నియమాలు పాటించాల్సిందే..
బళ్లారి, చిత్రదుర్గం, తుమకూరు జిల్లాలోని గనులను ఏ, బీ, సీ శ్రేణులుగా విభజించారు. ఇందులో ఏ శ్రేణి గనులు 45, బీ శ్రేణి 70గా, సీ శ్రేణి 51గా కేంద్రం తేల్చిచెప్పింది. ఏ, బీ శ్రేణి గనులకు క్లీన్ చిట్ ఇచ్చారు. సీ శ్రేణి గనుల్లోనే ఎక్కువ అక్రమాలకు పాల్పడిందని తేల్చి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ గనులకు సంబంధించి జరిగిన అక్రమాల్లో చాలా మంది ప్రజాప్రతినిధులు జైలుపాలై, నేటికీ కేసులు ఎదుర్కొంటున్నారు. గనుల మూతతో కర్ణాటకలో ఉక్కు ఉత్పత్తి పడిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లక్రితం సుప్రీంకోర్టుకు విన్నవించుకోగా, పునరుద్ధరణ, పునర్నిర్మాణ (ఆర్అండ్ఆర్) పనులను పడక్బందీగా పూర్తి చేసిన వారికి మళ్లీ అనుమతి ఇవ్వొచ్చని కోర్టు తేల్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం బళ్లారి జిల్లాలో 25 దాకా గనులు మళ్లీ నడుస్తున్నాయి. సీ శ్రేణి గనులను ప్రభుత్వం వేలం వేయడంతో జిందాల్, ఎమ్మెస్పీఎల్ సంస్థలు వాటిని దక్కించుకున్నాయి. గనుల విస్తీర్ణం మేరకు వాటికి వార్షికంగా ఇంతే మెట్రిక్ టన్నుల ఖనిజం తవ్వి తీయాలని నిబంధనలు విధించారు. కానీ సరకును ఇండియాలోనే విక్రయించాలన్న గట్టి నిబంధనలు అమలు చేశారు. 2011కన్నా పూర్వం ఇక్కడి ముడిసరకు చైనాకు తరలివెళ్లేది. సుప్రీం కోర్టు కొరడా అనంతరం దేశం దాటలేదు. ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేయవచ్చని నిబంధనలను సడలించారు. ఎగుమతిలో కేంద్ర ప్రభుత్వ నియమాలను పాటించాలని సూచించింది.
విదేశాలకు తరలింపు తేలికైన పనికాదు..
‘ప్రస్తుతం మన దేశంలోనే టన్ను ముడి సరకు రూ.3 నుంచి రూ.5వేల దాకా నాణ్యతనుబట్టి విక్రయిస్తున్నారు. ఇప్పుడు విదేశాలకు ఎగుమతికి అనుమతి ఇచ్చారు. రాజస్వం, పన్నులను చెల్లించి విదేశాలకు తరలించడం అంత సులభం కాదు. ఇప్పుడు చైనాలో కూడా ఇక్కడి ఇనుప ఖనిజానికి అంతగా డిమాండు లేదు. ఎగుమతికి అనుమతి ఇవ్వడం సంతోషదాయకమే. కానీ తరలింపులో పలు ఇబ్బందులు ఉన్నాయని హొసపేటెలోని ఓ ప్రముఖ గనుల సంస్థ ఇంజినీరు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో ఇక్కడి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామనగరలో శివశక్తి ప్రదర్శన
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్ -
పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
[ 29-03-2024]
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. -
గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప
[ 29-03-2024]
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. -
నాకు ప్రాణాపాయం
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
యాప్ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!
[ 29-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్లను సిద్ధం చేసింది. ఈ యాప్లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
[ 29-03-2024]
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. -
ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
[ 29-03-2024]
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
[ 29-03-2024]
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. -
లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ