వర్షాలకు రూ.2.39 కోట్ల నష్టం
జిల్లాలో వారం నుంచి కురిసిన వర్షాలకు రూ.2.39 కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకు వివరించారు. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బొమ్మై జిల్లా పాలనాధికారి, ఇతర శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీఎం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న డీసీ పవన్కుమార్ మాలపాటి, ఇతర శాఖాధికారులు
బళ్లారి, న్యూస్టుడే : జిల్లాలో వారం నుంచి కురిసిన వర్షాలకు రూ.2.39 కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకు వివరించారు. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బొమ్మై జిల్లా పాలనాధికారి, ఇతర శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీసీ మాట్లాడుతూ ఈ మధ్య కురిసిన వర్షాలకు ఇద్దరు మృతి చెందగా.. నిబంధనల ప్రకారం రూ.5 లక్షల పరిహారం అందజేసినట్లు సీఎంకు తెలిపారు. 14 పశువులు, గొర్రెలు మృత్యువాత పడ్డాయి. 161 ఇళ్లకు నష్టం జరిగింది. 244.1 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వివరించారు. 371 విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. 31 విద్యుత్తు ట్రాన్స్ఫ్మార్మర్లు కాలిపోయాయి. మొత్తం రూ.2.39 కోట్లు నష్టం జరిగినట్లు సీఎంకు వివరించారు. పరిహారం అందని వారికి మూడు రోజుల్లో పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి అడిగిన ఒక ప్రశ్నకు డీసీ సమాధానమిచ్చారు. వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా పంచాయతీ సీఈవో జి.లింగమూర్తి, జిల్లా పోలీస్ అధికారి సైదులు అడావత్, ఏడీసీ పి.ఎస్.మంజునాథ, ఏసీ డా.ఆకాశ్ శంకర్, వ్యవసాయ జేడీ డా.మల్లికార్జున, ఉద్యాన శాఖ జేడీ శరణప్ప భోగి, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉన్నాం.. అన్నింటినీ ఎదుర్కొంటాం..
హొసపేటె: వర్షాలు సృష్టిస్తున్న సమస్యలను ఎదుర్కొనేందుకు విజయనగర జిల్లాలో అధికారులతో కలిసి అప్రమత్తంగా ఉన్నామని పర్యాటక శాఖ మంత్రి ఆనంద్సింగ్ పేర్కొన్నారు. వాన తెచ్చిన నష్టాలపై సంబంధించిన జిల్లాల మంత్రులు, పాలనాధికారులతో శనివారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుతూ పలు సూచనలిచ్చారు. జిల్లాలోని పశ్చిమ తాలూకాల్లో వాన ప్రభావం ఎక్కువగా ఉంది. ముందు జాగ్రత్త చర్యగా ఆ తాలూకాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించామని డీసీ సీఎంకు నివేదించారు. ప్రకృతి బీభత్సంతో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని డీసీ వివరించారు. జిల్లాలో నిధుల కొరత లేదని పేర్కొన్నారు. వర్ష ప్రభావం తగ్గేవరకూ తహసీల్దారు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, కార్యదర్శులు కేంద్ర స్థానాల్లోనూ ఉండాలని సూచనలిచ్చామని తెలిపారు. తుంగభద్రకు వరద పెరిగినందున హడగలి, హగరిబొమ్మనహళ్లి ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలిచ్చామని వివరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో భోయేర్ హర్షల్ నారాయణ రావు పాల్గొన్నారు.
పంట పరిశీలన
నష్టపోయిన వరి పంటను పరిశీలిస్తున్న అధికారులు
బళ్లారి, న్యూస్టుడే : బళ్లారి తాలూకాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన వరి పైర్లను బళ్లారి ఉపవిభాగం అసిస్టెంట్ కమిషనర్ డా.ఆకాశ్ శంకర్, వ్యవసాయశాఖ జేడీ డా.మల్లికార్జున, తహసీల్దారు విశ్వనాథ తదితరులు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. బళ్లారి తాలూకా బైరదేవనహళ్లి గ్రామంలో హొన్నారెడ్డికి చెందిన ఏడు ఎకరాలు, కృష్ణమూర్తి, బసవరాజకు చెందిన 23 ఎకరాల్లో వరి రెండు రోజుల్లో కోత కోయవల్సి ఉండగా, ఈ మధ్యలోనే కురిసిన వర్షాలకు పూర్తిగా వర్షపునీటిలో మునిగిపోయి మొలకలు వచ్చాయి. ఈ పంటను అధికారులు పరిశీలించి రైతులు నుంచి వివరాలు తెలుసుకున్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖËర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!