ఏకే రావు మృతి కేసులో వీడని గుట్టు
కన్నడ, తెలుగు నేపథ్య గాయని హరిణిరావు తండ్రి ఏకే రావు మృతి కేసు కొత్తమలుపులు తిరుగుతోంది. ఆయన మృతదేహానికి సంబంధించిన శవపరీక్ష నివేదిక కోసం రైల్వే పోలీసులు ఎదురుచూస్తుంటే..
ఈనాడు డిజిటల్, బెంగళూరు: కన్నడ, తెలుగు నేపథ్య గాయని హరిణిరావు తండ్రి ఏకే రావు మృతి కేసు కొత్తమలుపులు తిరుగుతోంది. ఆయన మృతదేహానికి సంబంధించిన శవపరీక్ష నివేదిక కోసం రైల్వే పోలీసులు ఎదురుచూస్తుంటే.. ఆయనపై వంచన కేసులు నమోదు చేసుకున్న బెంగళూరు ఆగ్నేయ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆగ్నేయ డీసీపీ శ్రీనాథ్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏకే రావు పేరిట ఉన్న లోన్ కన్సల్టెన్సీ కంపెనీ ద్వారా రుణాలిస్తామని నమ్మించిన ఫైనాన్షియర్లు డేనియల్ ఆమ్స్ట్రాంగ్, వివేకానంద కుమార్, రవి రాఘవన్ కలిసి బెంగళూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి పి.గిరీష్ నుంచి రూ.2.3 కోట్లు, అరుణాచల్ప్రదేశ్కు చెందిన వ్యాపారి తరమ్ నుంచి రూ.3.6కోట్లు వసూలు చేశారు.ఆ తర్వాత వారి నుంచి స్పందన లేకపోవటంతో బాధితులు ఏకే రావును నిలదీశారు. ఈ విషయంలో తానూ మోసపోయానని రావు చెప్పినా, వినని బాధితులు ఈనెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏకేరావు, ఆయన మిత్రుడు మరాళి, 22న విచారణకు హాజరయ్యారు. ఆ మరుసటి రోజు ఉదయమే ఏకేరావు మృతి చెందారు.
కూతురు ఇంటికని చెప్పి
ఈ నెల 8న బెంగళూరుకు వచ్చిన ఏకేరావు, జీఎం పాళ్యలోని తన చిన్న కుమార్తె శాలినీరావు ఇంట్లో 13వ తేదీ వరకు ఉన్నారు. అనంతరం రెసిడెన్సీ రోడ్డులోని చాన్సరీ పెవిలియన్ హోటల్లో దిగారు. అక్కడి నుంచే, మరాళితో కలిసి సుద్దగుంట పాళ్య పోలీసుల విచారణకు హాజరయ్యారు. 22న విచారణ ముగియగా, అదే రోజు రాత్రి కుమార్తె వద్దకని చెప్పి యలహంకకు క్యాబ్లో వెళ్లారు. ఏకే రావు యలహంకకు వెళ్తాడన్న సంగతి తనకు తెలియదని మరాళి పోలీసులకు చెప్పారు. సోమవారం శవపరీక్ష నివేదిక వచ్చే అవకాశం ఉందని యలహంక రైల్వే పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శివకుమార్ వివరించారు. ఏకే రావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే హత్య కేసు నమోదు చేశామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. -
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?