లోక్ అదాలత్ను విజయవంతం చేయండి
ఈ నెల 11న జరిగే లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులు రాజీ చేయించి విజయవంతం చేయాలని జిల్లా అదనపు న్యాయమూర్తి పద్మ అన్నారు. శనివారం న్యాయస్థానం గదిలో
జిల్లా అదనపు న్యాయమూర్తి పద్మ
వికారాబాద్, న్యూస్టుడే: ఈ నెల 11న జరిగే లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులు రాజీ చేయించి విజయవంతం చేయాలని జిల్లా అదనపు న్యాయమూర్తి పద్మ అన్నారు. శనివారం న్యాయస్థానం గదిలో పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని పోలీస్ ఠాణాల్లో నమోదైన కేసుల్లో రాజీ కుదుర్చుకోదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలను ఒప్పించాలన్నారు. ఇందుకు గ్రామాల వారీగా పర్యటించి రాజీ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయమూర్తి శ్రీదేవి, జూనియర్ న్యాయమూర్తి శ్రీకాంత్, వికారాబాద్, తాండూర్, డీఎస్పీలు సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి రమేష్, ఏపీపీలు రాజేశ్వర్, అశోక్కుమార్, సీఐలు, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?