మెట్రోకు బీజం.. రవీంద్రభారతి అంటే ఇష్టం
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతితో నగరంలో విషాదఛాయలు అలముకొన్నాయి. బల్కంపేటలోని ధరంకరం రోడ్డులోని నివాసానికి వెళ్లి పలువురు పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనకు నగరంతో నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉంది.
నగరంతో కొణిజేటిది నాలుగున్నర దశాబ్దాల అనుబంధం
ఈనాడు, హైదరాబాద్, సంజీవరెడ్డినగర్, అమీర్పేట, గాంధీఆసుపత్రి, న్యూస్టుడే: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతితో నగరంలో విషాదఛాయలు అలముకొన్నాయి. బల్కంపేటలోని ధరంకరం రోడ్డులోని నివాసానికి వెళ్లి పలువురు పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనకు నగరంతో నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉంది. 1978 నుంచి నగరంలో నివాసం ఉంటున్నారు. సాధారణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కువగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో నివాసం ఉండేవారు. అందుకు భిన్నంగా రోశయ్య బల్కంపేట ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. సాధారణ ప్రజలతో మమేకమయ్యేవారు. 2009లో రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక బల్కంపేట నుంచే రాకపోకలు సాగించేవారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య మెట్రోరైలు ప్రాజెక్ట్గా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రోరైలు ఒప్పందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో జరిగింది. 2010 సెప్టెంబరు 4న అప్పటి సీఎం రోశయ్య సమక్షంలో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ, ప్రభుత్వం తరఫున హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ మధ్య ఒప్పందం జరిగింది. మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి ఆయనకు నివాళులు అర్పిస్తూ ఒప్పందం నాటి ఫొటోను ట్వీట్ చేశారు. రోశయ్య బల్కంపేట ఎల్లమ్మ తల్లికి పెద్ద భక్తులు. ఆలయానికి పెద్ద దాత. అమ్మవారిని ఎంతో ఇష్టంగా కొలిచేవారు. దేవస్థానానికి కొద్దిదూరంలోనే ఆయన నివాసం ఉంటుంది. ఎన్నికల్లో పోటీచేసినప్పుడు నామినేషన్ వేసేటప్పుడు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, గవర్నర్ పదవి చేపట్టినప్పుడు ముందుగా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. టేకుతో చేసిన భారీ రథాన్ని(దీని విలువ సుమారు రూ.18 లక్షలు) దేవస్థానానికి అందజేశారు. ఎల్లమ్మ కల్యాణమహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఈ రథంపైనే పురవీధుల్లో ఊరేగిస్తారు.
సచివాలయం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలకు..
రవీంద్రభారతి అంటే ఎనలేని ప్రేమ కనబరిచేవారని సాహితీవేత్తలు చెబుతున్నారు. మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ హోదాలో సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ సదస్సులకు తరచూ హాజరయ్యేవారు. సెక్రటేరియట్లో పనులు ముగించుకుని రవీంద్రభారతికి చేరుకునేవారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు నిత్యం ఖైరతాబాద్ ఫ్లైఓవర్పై నుంచే రాకపోకలు సాగించేవారు. పైవంతెన దుస్థితిని గుర్తించి అధికారులకు చెప్పి వెంటనే మరమ్మతులు చేయించారు. గాంధీ ఆసుపత్రి ఓపీ, ఎమర్జెన్సీ భవనాన్ని 2007 పిబ్రవరి 25న ఆర్థిక, వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ మంత్రిగా ఉన్న రోశయ్య, స్థానిక ఎమ్మెల్యే టి.పద్మారావుతో కలిసి ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి: కేటీఆర్
[ 23-04-2024]
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డికి బుద్ధి చెప్పాలని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
[ 23-04-2024]
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానం పోటెత్తి.. చెయ్యెత్తి జైకొట్టి
[ 23-04-2024]
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
పొరుగు నేతలకే పెద్దపీట
[ 23-04-2024]
గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. -
కొండంత విశ్వాసం
[ 23-04-2024]
చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.c -
4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?
[ 23-04-2024]
రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. -
చరవాణి హ్యాక్ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా
[ 23-04-2024]
మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్కు ‘మీ ఖాతా బ్లాక్ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. -
15 స్ట్రాంగ్ రూముల్లో.. 5వేల ఈవీఎంలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ వెల్లడించారు. -
అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3
[ 23-04-2024]
నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. -
ప్రతిదానికీ ఓ లెక్కుంది..!
[ 23-04-2024]
ఫలితాల వరకు ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
[ 23-04-2024]
నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. -
స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. -
గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
[ 23-04-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రేవంత్రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల
[ 23-04-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. -
సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం
[ 23-04-2024]
జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. -
విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన డీసీఎం దగ్ధం
[ 23-04-2024]
పార్కింగ్ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
[ 23-04-2024]
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. -
సీఎం సుడిగాలి పర్యటన నేడు
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్
[ 23-04-2024]
మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం
[ 23-04-2024]
తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది. అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి
[ 23-04-2024]
జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్ సోమవారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ