రెంచి పడతాం.. రక్షణ కల్పిస్తాం
శాంతి భద్రతలు, ట్రాఫిక్ బాధ్యతలు, సైబర్ క్రైం కేసుల ఛేదన ఇలా ఏ విషయంలోనైనా రాష్ట్రంలోని మహిళా పోలీసులు పురుషులతో సమానంగా విధులు నిర్వహిస్తూ శేభాష్
రాచకొండ కమిషనరేట్లో మహిళా సిబ్బందికి వాహనం నడపడం, మరమ్మతులపై శిక్షణ
మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తున్న పోలీసు అధికారి
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: శాంతి భద్రతలు, ట్రాఫిక్ బాధ్యతలు, సైబర్ క్రైం కేసుల ఛేదన ఇలా ఏ విషయంలోనైనా రాష్ట్రంలోని మహిళా పోలీసులు పురుషులతో సమానంగా విధులు నిర్వహిస్తూ శేభాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా రాత్రి వేళల్లో సైతం గస్తీ నిర్వహించడం, విధి నిర్వహణలో వాహనం మొరాయిస్తే మరమ్మతులు చేయడం వంటి క్లిష్టతర అంశాల్లో శిక్షణ తీసుకుని మెరికల్లా తయారవుతున్నారు రాచకొండ కమిషనరేట్లోని మహిళా పోలీసులు.
49 రోజులపాటు తర్ఫీదు..
నేరస్థులను పట్టుకునేందుకు.. నేరాలను నియంత్రించేందుకు అధునాతన వాహనాలను పోలీసులకు ప్రభుత్వం సమకూర్చింది. వీటిని ఇప్పటివరకూ పురుషులే నడుపుతున్నారు. ఉమెన్ సేఫ్టీవింగ్లో భాగంగా మహిళా సిబ్బందిని సైతం ఇందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16మంది ఏఆర్ మహిళా పోలీసులు ముందుకు వచ్చారు. వీరిలో ఐదుగురు ఏఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 9మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరికి నాలుగు చక్రాల వాహనాలు నడపటం, మరమ్మతులు చేయడం వంటి అంశాలపై 49రోజులపాటు కఠోర శిక్షణ అందించారు. పాతబస్తీ పేట్లబురుజులోని పోలీస్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ఓ పీటీవో అధికారి శిక్షణ ఇచ్చారు. అసలు వాహనం గురించే అవగాహన లేని వీరికి మొదటి సిమ్యులేటర్పై శిక్షణ అందించారు. తర్వాత ట్రాఫిక్లో చాకచక్యంగా నడిపేలా తర్ఫీదునిచ్చి లైసెన్స్లు అందించారు. ఏదైనా సమస్యతో వాహనం మొరాయిస్తే వెంటనే తెలుసుకుని బాగుచేయడం గురించి వివరించారు. టైర్ మార్చడం, ప్రతికూల పరిస్థితుల్లో వాహనాన్ని నడపడం, పెట్రోలింగ్ నిర్వహించడం, ప్రమాదాలు నియంత్రించడం, బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడం, ఆగిపోయినా సరే వాహనాన్ని స్టార్ట్ చేయడం వంటి అంశాల్లో శిక్షణ కొనసాగింది.
వారే ఉంటే బాగుంటుందని..
మహిళల ఫిర్యాదులపై పోలీసులు ఘటనాస్థలానికి వెళ్తే సమస్య వినేందుకు పురుషులు కంటే మహిళా పెట్రోలింగ్ పోలీసులు ఉంటే బాగుంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ భావించారు. ఇందుకోసం కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్లలో డ్రైవింగ్ చేసే మహిళా సిబ్బంది ఉండాలని వీరికి శిక్షణ అందించారు. ప్రస్తుతం శిక్షణ తీసుకున్న మొదటి బ్యాచ్ను పరిశీలించిన రాచకొండ సీపీ, ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి బ్యాచ్కు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారని ప్రస్తుతం రెండో బ్యాచ్లో మరో 16 మందికి శిక్షణ కొనసాగుతుందని మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారి ఏసీపీ భాస్కర్ తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారి రాచకొండ కమిషనరేట్లో ఈ తరహా శిక్షణ ఇవ్వడం గర్వంగా ఉందన్నారు.
గర్వంగా ఉంది
రాణి, ఏఆర్ కానిస్టేబుల్
ఎలాంటి వాహనం ఇచ్చినా నడపగలను. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, సైబర్ క్రైంలో పని చేశాను. వాహనం నడపడం, మరమ్మతులు ఎందుకు చేయలేము అని ప్రయత్నించాను. ఇప్పుడు గర్వంగా భావిస్తున్నాను. వ్యక్తిగత జీవింతంలో కూడా ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది.
ఎన్నో అవకాశాలు ఉంటాయి
శ్వేత, ఏఆర్ కానిస్టేబుల్
నాకు ద్విచక్ర వాహనమే రాదు. అలాంటిది కారు నడపడం అంటే మొదట భయపడ్డాను. శిక్షణలో భాగంగా చాలా విషయాలు నేర్చుకున్నాను. యువతులు పోలీసులు ఉద్యోగాల్లోకి రావడానికి ఎలాంటి భయాలు పెట్టుకోవద్ధు ఇక్కడ మనని మనం నిరూపించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)