నెట్టింట పిలుపు.. నట్టింట పనులు
నగర జీవనం అంటేనే ఉరుకులు పరుగులతో కూడుకున్నది. అలాంటిది భార్యాభర్తలు ఉద్యోగులు, వ్యాపారులు అయితే చిన్నా, చితకా పనులు చేసుకునేందుకు సమయం వెచ్చించలేని పరిస్థితి. దీన్నే వ్యాపార
ఇల్లు శుభ్రం మొదలు పలు రకాల సేవలు
ఐటీకారిడార్లో పెరుగుతున్న ఆదరణ
ఈనాడు డిజిటల్, హైదరాబాద్
నగర జీవనం అంటేనే ఉరుకులు పరుగులతో కూడుకున్నది. అలాంటిది భార్యాభర్తలు ఉద్యోగులు, వ్యాపారులు అయితే చిన్నా, చితకా పనులు చేసుకునేందుకు సమయం వెచ్చించలేని పరిస్థితి. దీన్నే వ్యాపార మార్గంగా మలచుకుంటున్న అనేక సంస్థలు క్రమంగా తమ సేవలను విస్తరిస్తున్నాయి. మీట నొక్కగానే మేమున్నామంటూ ఇంటికి వచ్చి కావాల్సిన పనులు చేస్తున్నాయి. దీంతో సెలవు రోజుల్లో కుటుంబంతో మాత్రమే గడిపేలా పలువురు ఇలాంటి యాప్ ఆధారిత సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఉదయం పాలు వేసే దగ్గర నుంచి క్షవరం, లాండ్రీ, ఇల్లు శుభ్రం చేసుకోవడం, దుస్తులు కుట్టడం వంటి వాటికి ఇంటి ముంగిట వాలిపోతున్నారు.
ఆన్లైన్ దర్జీలు..
పురుషులకు అవసరమైన సూట్లు, మహిళల, చిన్నారుల దుస్తులు, మగ్గం వర్క్తో పాటు ఇతర డిజైన్లను ప్రత్యేకంగా చేయించాలనుకునేవారు ఈ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే సంస్థ ప్రతినిధి షెడ్యూల్ సమయంలో వచ్చి కొలతలు తీసుకుంటారు. అనంతరం డిజైనర్ వీడియో లేదా ఆడియోకాల్లో మాట్లాడి నచ్చిన విధంగా దుస్తులను కుట్టి డెలివరీ చేస్తారు. మార్పులు, చేర్పులు అవసరమైతే మరోసారి తీసుకెళ్లి రీడెలివరీ చేస్తారు. క్లౌడ్ టేలర్, టేలర్మోబ్, టేలర్జంక్షన్ తదితర సంస్థలు అందుబాటులో ఉన్నాయి. రూ.650 నుంచి మొదలుకొని లక్షలాది రూపాయల విలువైన దుస్తులకు ఆర్డర్లు ఇస్తున్నారు.
ఉపాధి పొందుతున్న వారు: 2వేలు
లాండ్రీయాప్..
వినియోగదారు నుంచి ఫోన్ కాల్ వచ్చిన వెంటనే సిబ్బంది ఇంటికొచ్చి దుస్తులు తీసుకెళ్తారు. ప్రతిదానికీ ఓ ట్యాగ్ తగిలిస్తారు. ఆ దుస్తుల్ని ఎలా ఉతకాలో ఆ ట్యాగ్ వివరిస్తుంది. దీంతో ఒకరివి మరొకరికి మారడం ఉండదు. ఖరీదైన దుస్తులు పాడైపోతాయన్న దిగులు ఉండదు. వీటిని వివిధ రకాలుగా విభజించి ఉతికి, వాటిని ఇస్త్రీ చేసి ఇంటికి చేరుస్తారు. ఇదీ లాండ్రీయాప్లు పని తీరు. కొన్ని సంస్థలు 1.5కేజీల బరువు ఉంటే రూ.400, 4.5 కేజీలు ఉంటే రూ.300 చెల్లించేలా ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నాయి. నగరంలో 6లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా..ఇందులో 1.80లక్షల మంది ఈ సేవలను పొందుతున్నారు. వీటితోపాటు హోటళ్లు, లాడ్జీలు, వీటి సేవలను ఉపయోగించుకుంటున్నాయి. హెలోవాష్, ది లాండ్రీ బాస్కెట్, పర్ల్ వాష్ లాండ్రీ, వాష్హబ్ ఆన్లైన్ తదితర సంస్థలు అందుబాటులో ఉన్నాయి.
ఉపాధి పొందుతున్న వారు: 7వేలు
సౌందర్యానికి మెరుగులు
బ్యూటీ సర్వీసెస్, హోమ్ సెలూన్, అర్బన్ క్లాప్ వంటి పేర్లతో అనేక సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి. మహిళలు బ్యూటీపార్లర్కు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వీటిని పొందుతున్నారు. హెయిర్ కేర్తోపాటు స్టైలింగ్, ఫేషియల్, క్లీనప్, బ్లీచ్, మేకప్ తదితర సేవలున్నాయి. పురుషులకు హెయిర్ కట్, క్లీనింగ్, ఫేస్బ్లీచ్ తదితర సేవలు అందిస్తున్నారు. యాప్లో బుక్ చేయగానే ఇంటికొచ్చిన ప్రతినిధి రేటింగ్, చేసే పని ఆధారంగా నిముషానికి రూ.6 నుంచి రూ.15 వరకు ఛార్జీ చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు హెయిర్స్టైల్ ఆధారంగా రూ.200 నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నాయి.
ఉపాధి పొందుతున్న వారు: 2వేలు
వారే ఊడుస్తారు..
ఇంటిని శుభ్రం చేయడం ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న సేవల్లో ఒకటిగా మారింది. నగరంలో చాలా కాలం నుంచి ఈ సేవలను అనేక సంస్థలు అందిస్తున్నాయి. డీప్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ను ఎక్కువ మంది నగరవాసులు కోరుకుంటున్నారు. విదేశాల్లో ఉంటున్నవారు, కొవిడ్తో నగరం వదిలి సొంత ఊళ్లకు వెళ్లినవారు ఇళ్లను శుభ్రం చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా మాదాపూర్, కొండాపూర్, ఖాజాగూడ, గచ్చిబౌలి, హైటెక్సిటీ, కోకాపేట, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఈ సేవలకు డిమాండ్ ఉంది. ఐటీ ఉద్యోగులు, ఆకాశహర్మ్యాల్లోని ఫ్లాట్లు, విల్లాల నుంచి ఎక్కువగా బుకింగ్ వస్తున్నాయని ఆయా సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.
ఉపాధి పొందుతున్న వారు: 5వేలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్