కంప్యూటరు తరగతి.. ప్రారంభిస్తే పురోగతి
సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు తెలియాలంటే ప్రాథమిక దశ నుంచే వారికి విగణితలపై అవగాహనతోపాటు, ఆంగ్లబోధన ఎంతో అవసరం. పేదలు సైతం తమ పిల్లలకు కంప్యూటరు రావాలని అభిలషిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వం ఎంపీ లాడ్స్ ఇతర పథకాల
చిట్యాల పాఠశాలలో నిరుపయోగంగా..
న్యూస్టుడే,పరిగి: సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు తెలియాలంటే ప్రాథమిక దశ నుంచే వారికి విగణితలపై అవగాహనతోపాటు, ఆంగ్లబోధన ఎంతో అవసరం. పేదలు సైతం తమ పిల్లలకు కంప్యూటరు రావాలని అభిలషిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వం ఎంపీ లాడ్స్ ఇతర పథకాల కింద కోట్లాది రూపాయలను వెచ్చించి పంపిణీ చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా నిర్వహణ లోపం ప్రధాన అవరోధంగా మారింది. ఎప్పకటిప్పుడు పర్యవేక్షిస్తూ సక్రమంగా అమలు చేయాల్సిన అధికారులు వాటి గురించి విస్మరించారు. ఈ పథకాన్ని గాడిన పెట్టేందుకు అధికారులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విద్యాశాఖ గతేడాది వాటి పనితీరును తెలుసుకునేందుకు పాఠశాలల వారీగా సమాచార సేకరణ చేపట్టింది. మరమ్మతుకు అయ్యే ఖర్చెంత? లేదా కొత్తవి పంపిణీ చేయాలా అన్న కోణంలో పరిశీలించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కరోనా నేపథ్యంలో వాటి విషయం మళ్లీ మరుగున పడింది.
తాండూరు, పరిగి, కొడంగల్, వికారాబాద్ నియోజకవర్గాల పరిధిలో 748 ప్రాథమిక, 118 ప్రాథమికోన్నత, 156 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 18 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆరు గురుకులాలు, 11 ఎయిడెడ్, 9 ఆదర్శ, మరో మూడు మైనార్టీ విద్యాలయాలు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో 95వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కంప్యూటర్ల వినియోగం, మౌలిక సదుపాయాల్లో రాష్ట్రం వెనుకబడినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక గతంలోనే వెల్లడించింది. కనీసం ఇప్పుడైనా దృష్టి సారించాలని కోరుతున్నారు.
మరమ్మతుకు రూ.1.37కోట్లు
జిల్లాలో 18 మండలాల్లోని 160 పాఠశాలలకు గతంలో కంప్యూటర్లు పంపిణీ చేశారు. బోధకుల నియామకం లేకపోవడం, వినియోగించకపోవడంతో అవన్నీ ఉపయోగంలో లేకుండా పోయాయి. ఒక్కో కంప్యూటరుకు ప్రభుత్వం రూ.50వేల వరకు ఖర్చు చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న వాటి సంఖ్యను వేళ్లమీద లెక్కించాల్సిందే. కొన్నిచోట్ల కీబోరుల్డు, సీపీయూ, మదర్బోర్డు, ర్యాంలు, మౌస్లు పనిచేయడం లేదు. జిల్లా విద్యాశాఖ వాటిని బాగు చేసేందుకు దాదాపు రూ.1.37 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపింది. మరమ్మతు చేసినా, కొత్త వాటిని సరఫరా చేసినా వాటి నిర్వహణే ప్రధానం. కంప్యూటరు విద్యను ప్రారంభించిన మొదట్లో విద్యార్థులు ఉత్సాహంగా నేర్చుకున్నారు. వారికి ఆసక్తి ఉన్నా ప్రోత్సాహలేమి వారిని తీవ్ర నిరాశ,నిస్పృహలకు గురిచేస్తోంది. ల్యాబ్లు దుమ్ము పట్టిపోతున్నాయి. అదే ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులను కంప్యూటరు విద్యపై ఆకర్షితులను చేస్తున్నారు. ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటోంది.
ఇలా చేస్తే బాగు
* పాఠశాలల వారీగా బోధకులను నియామకం ః వారికి క్రమం తప్పకుండా గౌరవ వేతనం
* ప్రతి పాఠశాలకు అంతర్జాల సదుపాయం
* కనీసం రోజుకు ఒక గంట పాటు బోధన
* పాత వాటి నిర్వహణ కన్నా, కొత్తవి పంపిణీ చేయడం
* ల్యాబ్ల్లో సదుపాయాల కల్పన
* గ్రామీణ యువత ఆధ్వర్యంలో నిర్వహణ.
ఇవిగో ఉదాహరణలు
* పరిగి జడ్పీహెచ్ఎస్ నం.1 పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 545. పంపిణీ అయిన కంప్యూటర్లు 20. పనిచేస్తున్నవి 2.
* చిగురాల్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 137 మంది విద్యార్థులు. ఐదు కంప్యూటర్లలో ఒక్కటీ పనిచేయడం లేదు.
* ఇబ్రహీంపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు ఐదు కంప్యూటర్లు పంపిణీ చేయగా వీటిలో రెండు గడిసింగాపూర్ ఉన్నత పాఠశాలకు రెండింటిని తీసుకువెళ్లారు. మిగతావి మరమ్మతుకు గురయ్యాయి.
* ఖుదావంద్పూర్ పాఠశాలలో 92 మంది విద్యార్థులు. ఐదు కంప్యూటర్లు ఉన్నా ఏవీ పనిచేయడం లేదు.
* మిట్టకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు ఉన్నా ప్రయోజనం శూన్యం.
* చిట్యాల ఉన్నత పాఠశాలలో 11 విగణితలు ఉండగా మూడేళ్లుగా ఒక్కటీ పనిచేయడం లేదు.
* రాపోల్ ఉన్నత పాఠశాలలో రెండు వృథాయే.
ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి: హరిశ్చందర్, ఎంఈఓ, పరిగి
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం.మండల విద్యా వనరుల కేంద్రంలో పనిచేస్తున్న ఎంఐఎస్ల ద్వారా అప్డేట్ చేస్తాం. వారి సహకారంతో పాఠశాలల్లో కంప్యూటర్లు వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
[ 19-04-2024]
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
[ 19-04-2024]
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.