అప్రమత్తత.. సన్నద్ధత
జిల్లాలో మొదటి, రెండో దశ కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలను అతలాకుతలం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను నగరానికి చేర్చి చికిత్సలు జరిపించినా, రూ.లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. రెండో విడతలో చాలా మంది శరీరంలో
మూడో ముప్పు ఎదుర్కొనేందుకు వైద్యాధికారుల ఏర్పాట్లు
న్యూస్టుడే, వికారాబాద్ మున్సిపాలిటీ
భౌతిక దూరం లేదు.. మాస్కులు లేవు
జిల్లాలో మొదటి, రెండో దశ కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలను అతలాకుతలం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో బాధితులను నగరానికి చేర్చి చికిత్సలు జరిపించినా, రూ.లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. రెండో విడతలో చాలా మంది శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి ప్రమాదకర పరిస్థితికి చేరారు. 50 మంది మరణించినట్లు అధికార లెక్కలు చెబుతున్నా, అనధికారికంగా 400 మంది వరకు ఉంటారని అంచనా. నివారణకు టీకా పంపిణీ ముమ్మరం చేసి, ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. మూడో దశలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం కనిపించడంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాలతో జిల్లా అధికారులు అప్రమత్తమై ముప్పును ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో కరోనా ప్రభావం తగ్గలేదు. ఇటీవల తాండూరులో మళ్లీ వెలుగు చూసింది. మరోవైపు వివాహాలు, విందులు అధికమయ్యాయి. బస్టాండ్లు, కూరగాయల మార్కెట్లు, షాపింగ్ మాల్స్లో, రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. అయితే ఎక్కడా రక్షణ చర్యలు కనిపించడంలేదు. మాస్కులను మరిచిపోయారు. భౌతిక దూరం సంగతి సరేసరి. బస్సుల్లో కిక్కిరిసి వెళుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తే మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మంత్రి సమీక్ష: మంత్రి సబితారెడ్డి జిల్లా వైద్యాధికారులు, అధికారులతో వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్పై సమీక్ష నిర్వహించారు. ఈనెలాఖరు నాటికి 100 శాతం టీకాలను పూర్తి చేయాలని వారిని ఆదేశించారు. మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం తదితర కరోనా నియంత్రణ చర్యలను ప్రజలు కొనసాగించాలని అన్నారు. అంతేకాకుండా ఆమె వికారాబాద్ పట్టణం రాజీవ్గృహ కల్పలో పర్యటించి టీకాలు వేయించుకోవాలని ప్రజలను కోరారు.
పడకలు.. పరికరాలు
ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య విధాన పరిషత్తు పరిధి ఆసుపత్రుల్లో అన్నింటా అనుసరించాల్సిన కార్యాచరణను జిల్లా వైద్యారోగ్య శాఖ రూపొందించింది. ప్రత్యేక పడకలు, పరికరాలు, మందులు తదితర ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లా ఆసుపత్రి తాండూరులో 100 పడకలు సిద్ధంగా ఉంచారు. వీటిలో 50 పడకలు మహిళలకు 50 పురుషులకు కేటాయించారు. వికారాబాద్ అనంతగిరి క్షయ ఆసుపత్రిలో 30 పడకలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉంచారు. చాలా ప్రాంతాల్లో వీటిని దాతలు విరాళంగా ఇచ్చారు. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
రెండో డోసుకు దూరంగా..
వ్యాక్సిన్ తొలి డోస్పై జిల్లాలో అమిత ఆసక్తి చూపారు. ఆస్పత్రుల వద్ద బారులు తీరారు. రెండో డోసు విషయంలో ఈ పరిస్థితి కనిపించలేదు. ఇప్పటి వరకు జిల్లాలో మొదటి డోసు 82 శాతం తీసుకోగా రెండో డోసు కేవలం 20 శాతం మాత్రమే తీసుకున్నారు. మొదటి డోసు తీసుకోని రెండో డోసుకు అర్హులైన వారు 27,646 మంది ఉన్నారు. వీరికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి టీకాలను తీసుకునేలా చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితిలో వివాహాలు, ఇతర విందులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని, వెళ్లినా తగిన జాగ్రత్తలు తప్పనిసరి సూచిస్తున్నారు.
ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం: డాక్టర్ తుకారాంభట్, జిల్లా వైద్యాధికారి
కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మంత్రి హరీశ్రావు ఆదేశాలతో కలెక్టర్ పర్యవేక్షణలో యంత్రాంగం అప్రత్తంగా ఉంది. టీకా పంపిణీ విషయంలో వైద్య సిబ్బంది శ్రమిస్తున్నారు. తక్కువ సంఖ్యలో తీసుకున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో పర్యటించి అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాణవాయువు పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చాం.
ఆదేశాలకు అనుగుణంగా..: డాక్టర్ జీవరాజ్, జిల్లా ఉప వైద్యాధికారి
మంత్రులు, ఉన్నతాధికారులు ఆదేశాలకు అనుగుణంగా టీకాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాం. కరోనా రెండు దశల పరిణామాలతో అనుభవాన్ని సాధించాం. గుర్తించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తున్నాం. ఇంటింటికీ వెళ్లి ఆశ కార్యకర్తలు టీకా వేస్తున్నారు. పంచాయతీల్లో, వార్డుల్లో ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసి ప్రక్రియ కొనసాగిస్తున్నాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తగిన సూచనలు, సలహాలు అందిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్