ఊపుతెచ్చిన ఉప్పల్ భగాయత్
మూడో దశ ఈ-వేలంలో ఉప్పల్ భగాయత్ భూములకు ఊహించని విధంగా భారీ ధర పలకడం హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు ఊపునిచ్చింది. అంచనాకు మించి అదనంగా తొలిసారి రికార్డు స్థాయి పాటొచ్చింది.
మరిన్ని లేఅవుట్ల విక్రయానికి సిద్ధమవుతున్న హెచ్ఎండీఏ!
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: మూడో దశ ఈ-వేలంలో ఉప్పల్ భగాయత్ భూములకు ఊహించని విధంగా భారీ ధర పలకడం హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు ఊపునిచ్చింది. అంచనాకు మించి అదనంగా తొలిసారి రికార్డు స్థాయి పాటొచ్చింది. మూసీ సమీప ప్లాట్లపై తొలుత కొనుగోలుదారుల్లో కాస్త సంశయం కనిపించినా.. ఆవైపు ఉన్న ప్లాట్లే ఏకంగా చదరపు గజానికి రూ.1.01 లక్ష పలికి రికార్డు సృష్టించాయి. మూడో దశలో అభివృద్ధి చేసినవి; ఒకటి, రెండు దశల్లో మిగిలిన 44 ప్లాట్లు వేలం వేయగా అందులో 39 ప్లాట్లు అమ్ముడుపోయి రూ.474.61 కోట్లు హెచ్ఎండీఏ ఖజానాలోకి చేరాయి. మిగిలిన 50,000 చదరపు గజాల భూమిని ఈ రెండు నెలల్లో అమ్మేందుకు యోచిస్తున్నారు. ఇదే ఊపులో మహానగర వ్యాప్తంగా మరిన్ని లేఅవుట్లకు వేలం వేద్దామని పలువురు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం.
ఆక్రమణలు ఆపి.. ఖజానా నింపి!
హెచ్ఎండీఏకు రాజధాని చుట్టుపక్కల దాదాపు 8,200 ఎకరాల భూ బ్యాంకు ఉంది. ఇప్పటికే 3,886 ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తోంది. అత్యధికంగా 3,553 ఎకరాలు రంగారెడ్డి జిల్లాలో ఉండగా 211 ఎకరాలు హైదరాబాద్లో, 121 ఎకరాలు మెదక్ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. కోకాపేటలో 200 ఎకరాలు విక్రయిస్తే రూ.5 వేల కోట్లు సమకూరుతాయని అంచనా వేస్తే కేవలం 49.949 ఎకరాలతోనే రూ.2 వేల కోట్లు సమీకరించారు. తెల్లాపూర్లో 200 ఎకరాలు, మియాపూర్లో 50, మోకిలాలో 40 ఎకరాలు, మూసాపేటలో కొంత.. ఇలా పలు చోట్ల భూములున్నాయి. వీటిలో కొన్ని అన్యాక్రాంతమవుతున్నాయి. కొంత భూమిని అభివృద్ధి చేసి వేలం వేస్తే అన్యాక్రాంతానికి అడ్డుకట్ట పడడంతోపాటు ఖజానా నిండుతుందని యోచిస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో పలు భూములపై వివాదాలు ఉండడంతో పరిష్కారానికి ప్రత్యేకాధికారులు రోజూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
భూముల ధరకు రెక్కలు!
ఉప్పల్ భగాయత్ భూముల్లో మొదటి, రెండో దశల్లో గరిష్ఠంగా చదరపు గజానికి రూ.79 వేలు పలకగా.. ఈ ఏడాది అనూహ్యంగా రూ.లక్ష దాటింది. 2018లో నిర్వహించిన వేలంలో చ.గజం కనీస ధర రూ.20 వేలు నిర్ణయించగా.. అత్యధికంగా అత్తాపూర్లో రూ.1.53 లక్షలు పలికింది. ఆ తర్వాత మాదాపూర్లో గజం రూ.1.52 లక్షలు, షేక్పేట్లో రూ.1.20 లక్షలు కోట్ చేశారు. కొవిడ్ తర్వాత ఈ రంగానికి నష్టమొస్తుందని భావిస్తే, ఆ తర్వాత వేలం వేసిన కోకాపేట భూముల్లో ఎకరానికి రూ.60.20 కోట్లు పలకగా.. గత రెండు రోజుల్లో ఉప్పల్లో అనూహ్య రీతిలో 84,966 చదరపు గజాలకు ఏకంగా రూ.474.61 కోట్లు తెచ్చిపెట్టింది. 222 గజాలు, 386 గజాలున్న ఓ రెండు ప్లాట్లలో చ.గజానికి రూ.1.01 లక్ష పలకగా అది ఇక్కడి భూముల ధరల్ని నిర్దేశించే స్థాయికి చేరిందనే చర్చ జరుగుతోంది. మొదటి దశలో సగటున ఓ ప్లాటు రూ.51 వేలు పలకగా రెండో దశలో రూ.52,800, మూడో దశలో రూ.55,859 పలికింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
[ 20-04-2024]
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలి
[ 20-04-2024]
ప్రపంచం గర్వించే స్థాయికి తెలుగు యూనివర్సిటీ ఎదగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం బాచుపల్లిలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ 38వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.