అప్పుల బాధతో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్ పోలీసులు, యువకుడి బంధువుల వివరాల మేరకు... కర్ణాటకకు చెందిన అవినాష్ ఖర్గే(26) కుటుంబ సభ్యులు కొన్నేళ్ల క్రితం శివరాంపల్లికి వచ్చి స్థిరపడ్డారు.
26న పెళ్లి అంతలోనే అనంతలోకాలకు..
రాజేంద్రనగర్, న్యూస్టుడే: అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేంద్రనగర్ పోలీసులు, యువకుడి బంధువుల వివరాల మేరకు... కర్ణాటకకు చెందిన అవినాష్ ఖర్గే(26) కుటుంబ సభ్యులు కొన్నేళ్ల క్రితం శివరాంపల్లికి వచ్చి స్థిరపడ్డారు. ముగ్గురు సోదరులతో పాటు తల్లిదండ్రులు ఇక్కడే నివసిస్తున్నారు. అవినాష్ ఖర్గే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 26వ తేదీన అవినాష్కి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతడు వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ.15 లక్షల వరకు వ్యక్తిగత రుణాలు తీసుకున్నాడు. నాలుగు నెలలుగా వాటిని సక్రమంగా చెల్లించట్లేదు. బ్యాంకుల నుంచి రుణం చెల్లించాలని ఒత్తిడి వస్తోంది. ఈ విషయంపై తన సోదరుడి దగ్గర వాపోయాడు. పెళ్లి తరువాత బ్యాంకు రుణాల గురించి చర్చిద్దామనుకున్నారు. ఈలోపే ఒత్తిడి తట్టుకోలేక అవినాష్ ఆదివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చాక గమనించిన కుటుంబ సభ్యులు.. రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అన్న సంతోష్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఊళ్లోనే బతుకుదామన్న భార్య.. భర్త కాదనడంతో బలవన్మరణం
కంటోన్మెంట్, న్యూస్టుడే: ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ గృహిణి కన్నుమూసింది. మారేడుపల్లి ఠాణా ఎస్సై రవికుమార్ వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన నాగేశ్వర్రావు, దేవి(26) దంపతులు కుమార్తె శ్రావ్య(4) కుమారుడు సాత్విక్(15నెలలు)తో కలిసి ఏడాదిగా వెస్ట్ మారేడుపల్లిలో ఉంటున్నారు. వీరి పెద్దకుమార్తె వైష్ణవి స్వగ్రామంలోని తాతయ్య వద్ద ఉంటోంది. వీరి పక్కింట్లోనే దేవి అక్క నందిని, బావ శ్రీను ఉంటున్నారు. నాగేశ్వర్రావు స్థానికంగా ఓ కంటి ఆసుపత్రిలో ఆఫీస్బాయ్గా పనిచేస్తున్నాడు. దేవి గృహిణి. కొద్దిరోజులుగా ఆమె స్వగ్రామానికి వెళ్లి అక్కడే ఏదో పనిచేసుకొని బతుకుదామని పట్టుపడుతోంది. భర్త నిరాకరించడంతో గొడవలు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా ఆమె మనస్తాపానికి గురవుతోంది. శనివారం ఉదయం భర్త 9:30 గంటల ప్రాంతంలో విధులకు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దేవి ఇంట్లోకి వెళ్లి గడియవేసుకుంది. పక్కింట్లో ఉన్న నందిని చూసి నిద్రపోవడానికి వెళ్లిందేమో అనుకుంది. కొంతసేపటికి సాత్విక్ ఏడుపు వినిపించడంతో కిటికీలోంచి చూసేసరికి దేవి ఫ్యాన్కు చీరతో ఉరేసుకుంటూ కనిపించింది. నందిని అరుపులు విన్న శ్రీను తలుపులు బద్ధలుగొట్టి దేవిని కిందకు దింపారు. హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం ఆమె మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
భవనంపై నుంచి పడి కార్మికుడి మృతి
ఘట్కేసర్, న్యూస్టుడే: భవనంపై ప్రకటనల బోర్డు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పిర్జాదిగూడకు చెందిన వీరస్వామి(35) ఆదివారం ఘట్కేసర్ మండలం అవుషాపూర్లోని ఓ భవనం మొదటి అంతస్తుపై ప్రకటన బోర్డు బిగిస్తుండగా కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఇతడిని స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. యజమాన్యం నిర్లక్ష్యమే ఘటనకు కారణమని, పని చేస్తున్న చోట రక్షణ చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోయారు. వీరస్వామి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
[ 24-04-2024]
తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. -
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..