logo

ఆర్థిక ఇబ్బందులతో గొడవపడి భర్త..

ఆర్థిక ఇబ్బందులతో గొడవపడి భర్యత అత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తుజాల్‌పూర్‌ గ్రామంలో జరిగింది. ఎస్సై గంగరాజు తెలిపిన ప్రకారం... గ్రామానికి

Published : 07 Dec 2021 01:22 IST

నర్సాపూర్‌ రూరల్‌, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో గొడవపడి భర్యత అత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తుజాల్‌పూర్‌ గ్రామంలో జరిగింది. ఎస్సై గంగరాజు తెలిపిన ప్రకారం... గ్రామానికి చెందిన గాలి సుధాకర్‌ (36), లక్ష్మి భార్యా భర్తలు. కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు. ప్రభుత్వ వసతి గృహాలలో ఉంటూ చదువుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా బొంతపల్లి సమీపంలోని పరిశ్రమలో పనులు చేస్తు జీవనం సాగిస్తున్నారు. ఇంటి అవసరాల కోసం చేసిన అప్పులున్నాయి. ఆదివారం ఇద్దరూ తుజాల్‌పూర్‌ వెళదామని బయలుదేరారు. వీరి మధ్య నర్సాపూర్‌ బస్టాండ్‌లో వాగ్వాదం జరిగింది. దీంతో లక్ష్మి బొంతపల్లి వెళ్లగా, సుధాకర్‌ తుజాల్‌పూర్‌ వెళ్లి ఇంట్లో దూలానికి ఉరివేసుకుని మృతి చెందాడు. సోమవారం ఉదయం చుట్టపక్కల వారు ఆమెకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు శవపరీక్ష నిమిత్తం నర్సాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని