logo

Hyderabad News: బైక్‌పై 179 చలానాలు.. వాహనం వదిలి వ్యక్తి పరార్‌

 భారీగా చలానాలు పెండింగ్‌ ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు పట్టుకోగానే దాన్ని నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. కాచిగూడ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌

Updated : 07 Dec 2021 10:11 IST

అంబర్‌పేట, న్యూస్‌టుడే: భారీగా చలానాలు పెండింగ్‌ ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు పట్టుకోగానే దాన్ని నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. కాచిగూడ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం... సోమవారం సాయంత్రం అలీకేఫ్‌ చౌరస్తాలో ఎస్సై విజయ్‌ తనిఖీలు చేస్తున్నారు. ఓ ద్విచక్ర వాహనంపై 179 కేసులు పెండింగ్‌లో ఉన్నందుకు రూ.42,475 జరిమానా చెల్లించాలని తేలింది. దీంతో ఆ వ్యక్తి వాహనాన్ని వదిలి పారిపోయాడు. మెదక్‌ జిల్లాకు చెందిన రత్నయ్య పేరిట వాహనం ఉన్నట్లు గుర్తించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని