logo

ప్రేమ విఫలమై విద్యార్థి ఆత్మహత్య

ప్రేమ విఫలం కావడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు, హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ

Published : 07 Dec 2021 02:38 IST

కాచిగూడ, న్యూస్‌టుడే: ప్రేమ విఫలం కావడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు, హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ రాజు కథనం ప్రకారం... ఉప్పుగూడకు చెందిన నరేశ్‌యాదవ్‌(22) ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతను పాల వ్యాపారం చేస్తున్నాడు. మరొకరిని వివాహం చేసుకున్న ప్రియురాలు ఆదివారం నరేశ్‌యాదవ్‌ను కలిసింది. మనస్తాపానికి గురైన అతను సోమవారం తెల్లవారుజామున యాకుత్‌పుర-ఉప్పుగూడ స్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని