మద్యం మత్తులో మరణ మృదంగం
పీకలదాకా మద్యం తాగిన మందుబాబులు ఖరీదైన కార్లు నడుపుతూ బీభత్సం సృష్టించారు. నలుగురి ప్రాణాలు బలిగొన్నారు. బంజారాహిల్స్, నార్సింగి ప్రాంతాల్లో సోమవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. ఉప్పల్ రాఘవేంద్ర కాలనీకి చెందిన ఈఎల్వీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రోహిత్గౌడ్(29), కర్మన్ఘాట్కు చెందిన సాయిసోమన్(27) స్నేహితులు. మరో యువకుడితో కలిసి ఖరీదైన పోర్షే కారులో బయల్దేరారు.
పీకల దాకా తాగి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలు
రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురి దుర్మరణం
ఈనాడు, హైదరాబాద్ జూబ్లీహిల్స్, నార్సింగి న్యూస్టుడే: పీకలదాకా మద్యం తాగిన మందుబాబులు ఖరీదైన కార్లు నడుపుతూ బీభత్సం సృష్టించారు. నలుగురి ప్రాణాలు బలిగొన్నారు. బంజారాహిల్స్, నార్సింగి ప్రాంతాల్లో సోమవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు.
మూడు చోట్ల మద్యం తాగి
ఉప్పల్ రాఘవేంద్ర కాలనీకి చెందిన ఈఎల్వీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రోహిత్గౌడ్(29), కర్మన్ఘాట్కు చెందిన సాయిసోమన్(27) స్నేహితులు. మరో యువకుడితో కలిసి ఖరీదైన పోర్షే కారులో బయల్దేరారు. ఆదివారం రాత్రి దుర్గం చెరువు వద్ద ఆలివ్ బిస్ట్రోలో మద్యంతో విందు చేసుకున్నారు. తర్వాత జూబ్లీహిల్స్ రోడ్ నం.45లోని ఫ్యాట్ పీజియన్ పబ్కు వెళ్లి మళ్లీ మద్యం తాగారు. అనంతరం బంజారాహిల్స్ రాడిసన్ బ్లూప్లాజా హోటల్కు వెళ్లి మరోసారి మద్యం తాగారు. అర్ధరాత్రి దాటాక 1.20 గంటల ప్రాంతంలో పార్క్హయత్ వైపు 80-120 కి.మీ. వేగంతో వెళ్లారు. బంజారాహిల్స్ రోడ్ నం.2 రెయిన్బో ఆసుపత్రిలో యుటిలిటీ బాయ్గా పనిచేసే అయోధ్యరాయ్(23), అసిస్టెంట్ కుక్గా పనిచేసే దేబేంద్రకుమార్దాస్ టీ తాగి రోడ్డు దాటుతున్నారు. మద్యం మత్తులో కారును అదుపు చేయలేకపోయిన రోహిత్గౌడ్ వారిని వేగంగా ఢీకొట్టాడు. ఇద్దరూ విభాగిని ఆవల ఉన్న ఆసుపత్రి వైపునకు పడ్డారు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. రక్తపుమడుగులో కొట్టుకుంటున్న క్షతగాత్రుల పట్ల మానవత్వంతో స్పందించకుండా కారులోని ముగ్గురు జూబ్లీహిల్స్ చెక్పోస్టు వైపు కారుతో ఉడాయించారు. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఠాణాలో పనిచేసే హోంగార్డు జితేందర్సింగ్, కానిస్టేబుల్ సతీష్ జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 5లో గస్తీ కాస్తున్నారు. ముగ్గురు రాంగ్రూట్లో కారులో వస్తున్నట్లు గుర్తించారు. కారును ఫుట్బాల్ గ్రౌండ్ సమీపంలోని శ్రీపద్మావతి నిలయం సెల్లార్లో నిలిపి.. బీఎండబ్ల్యు కారులో వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు సెల్లార్లోని కారు ఫొటోలు తీసుకున్నారు. డీఎస్సై హరీశ్వర్రెడ్డికి ఆ ఫొటోలు పంపగా వాటిని బంజారాహిల్స్ పోలీసులకు పంపారు. జితేందర్సింగ్కు రాత్రి 2.55 గంటల సమయంలో సెల్లార్లో నిలిపిన కారు వద్దకు వెళ్లాడు. ఆయన్ను చూసి నిందితులు ముగ్గురు పారిపోయేందుకు యత్నించారు. మీరు చేసిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారని వైద్యం చేయించాలంటూ నమ్మించగా అంగీకరించారు. డీఎస్సై చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు. మూడో వ్యక్తి పరారయ్యాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రోహిత్గౌడ్ రక్తంలో మద్యం మోతాదు 70ఎంజీ, సాయిసోమన్కు 50ఎంజీగా ఉంది.
చూసీచూడనట్లు వదిలేయండి!
ఈనాడు, హైదరాబాద్: బంజారాహిల్స్ ఘటనలో నిందితుడైన రోహిత్గౌడ్ను తప్పించేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు, కొందరు నేతలు రంగంలోకి దిగారు. ‘మావాళ్లే చూసీచూడనట్టు వదిలేయమంటూ’ పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఏకంగా ఠాణాకు వచ్చి మాట్లాడినట్టు తెలుస్తోంది. బీటెక్ చదివిన రోహిత్గౌడ్ తండ్రి ఉప్పల్ కూడలిలో బార్ నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఆయనకు పలువురు ఎమ్మెల్యేలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఎమ్మెల్యేల ఒత్తిడితో పోలీసుల వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పనిచేయలేదంటూ సీసీ ఫుటేజీ విడుదల చేయలేదు.
నలుగురికి తీవ్రగాయాలు
మాదాపూర్, న్యూస్టుడే: ఆ ముగ్గురు వైద్య విద్యార్థులు. అర్ధరాత్రి పూటుగా మద్యం తాగారు. ఒకరు మత్తులోనే అతివేగంగా కారు నడిపి నలుగురు పాదచారులను ఢీకొట్టాడు. మాదాపూర్ ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం.. విజయవాడ సీతారాంపురం ప్రాంతానికి చెందిన ఎ.నిఖిల్రెడ్డి(26), వైజాగ్లోని తారకరాంనగర్కు చెందిన మెండు తరుణ్(24), మహారాణిపేటకు చెందిన గొట్టి ముక్కుల అఖిల్(23) ముగ్గురు స్నేహితులు. పీజీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కొండాపూర్లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ముగ్గురూ నిఖిల్రెడ్డి కారులో ఇనార్బిట్ మాల్లోని ఫ్యూజన్ పబ్కు వచ్చారు. మద్యం తాగి అర్ధరాత్రి ఇంటికి బయలుదేరారు. నిఖిల్రెడ్డి కారును నడుపుతూ దుర్గం చెరువు నర్సరీ వద్ద నేపాల్కు చెందిన రాహుల్ గౌతమ్(24), పంకజ్ అగ్రహారి, వినోద్ నాయక్(19), సూరజ్ గౌతమ్(27)లను ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. వీరంతా వలస వచ్చి మాదాపూర్ అరుణోదయ కాలనీలో ఉంటున్నారు. నిఖిల్రెడ్డిని రక్తంలో మద్యం మోతాదు 116 ఎంజీగా ఉన్నట్లు తేలింది. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు.
భార్యాభర్తలు కన్నుమూత
కోకాపేట్కు చెందిన పాల వ్యాపారి దుర్గం రాజు(37)భార్య మౌనిక(28) దంపతులు. గండిపేట్లోని బ్యాంకులో నగదు జమచేసేందుకు సోమవారం మధ్యాహ్నం బైకుపై గండిపేట్ వచ్చారు. పని ముగించుకుని.. పెట్రోల్ పోయించుకున్నారు. అపసవ్యదిశ(రాంగ్రూట్)లో కోకాపేట్ వైపు బయల్దేరారు. వేగంగా వస్తున్న క్వాలిస్ వాహనం ఎదురుగా వస్తున్న వారిని ఢీకొట్టి 100 మీటర్ల దూరం లాక్కెళ్లింది. తీవ్రగాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. కారు డ్రైవర్ సంజయ్ పూటుగా మద్యం తాగిఉన్నట్లు తేలింది. దంపతులకు పిల్లలు చంద్రిక(11), మణిదీప్(5), అనీష్(3) ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
[ 18-04-2024]
జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోతోంది. -
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
[ 18-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
[ 18-04-2024]
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
[ 18-04-2024]
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
[ 18-04-2024]
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?