మాటామాటా పెరిగి ఒకరిని హతమార్చిన బాలుడు
మద్యం మత్తులో ఉన్న ఓ బాలుడు(17) మరో తాగి ఉన్న వ్యక్తిని దారుణంగా అంతమొందించాడు. తరువాత తానే డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ బి.రాజు వివరాల ప్రకారం..
దుబ్బ సతీష్
మొయినాబాద్, న్యూస్టుడే: మద్యం మత్తులో ఉన్న ఓ బాలుడు(17) మరో తాగి ఉన్న వ్యక్తిని దారుణంగా అంతమొందించాడు. తరువాత తానే డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ బి.రాజు వివరాల ప్రకారం.. మొయినాబాద్కు చెందిన దుబ్బ సతీష్(26) పెయింటర్. సోమవారం సాయంత్రం మద్యం తాగి పోచమ్మ గుడి వద్ద నుంచి వెళుతున్నాడు. అదే సమయంలో పెద్దమంగళారానికి చెందిన సెంట్రింగ్ పనిచేసే బాలుడు, అతని స్నేహితులు నలుగురు ఫొటోలు దిగేందుకు వెళ్లారు. ఆలయం వద్ద స్నేహితుడి ద్విచక్ర వాహనంపై కూర్చొని ఉన్న బాలుడితో తాగి ఉన్న సతీష్ గొడవకు దిగాడు. సమీపంలో ఉన్న బండరాయితో సతీష్ తలపై బాలుడు బలంగా మోదాడు. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఘటన జరగ్గా, తిరిగి బాలుడు అర్ధరాత్రి అక్కడికి వచ్చాడు. అపస్మారక స్థితిలో ఉన్న సతీష్ను చూసి డయల్ 100కు ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులు ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే సతీష్ మృతి చెందాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!