logo

వందసార్లకు పైగా ప్రయత్నించా.. స్పందించరేం?

‘తెలంగాణలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఎన్నోసార్లు అడిగాను. వందసార్లకు పైగా ప్రయత్నించా. అయినా కలిసే అవకాశం ఇవ్వలేదు. మీ ఓఎస్‌డీకి సైతం ఎన్నోసార్లు విన్నవించా. అయినా ఇంత వరకు జవాబు

Published : 08 Dec 2021 03:06 IST

కేటీఆర్‌కు రాజాసింగ్‌ బహిరంగ వాట్సప్‌ సందేశం

గోషామహల్‌, న్యూస్‌టుడే: ‘తెలంగాణలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఎన్నోసార్లు అడిగాను. వందసార్లకు పైగా ప్రయత్నించా. అయినా కలిసే అవకాశం ఇవ్వలేదు. మీ ఓఎస్‌డీకి సైతం ఎన్నోసార్లు విన్నవించా. అయినా ఇంత వరకు జవాబు ఇవ్వలేదం’టూ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ్‌ మంగళవారం మంత్రి కేటీఆర్‌కు బహిరంగంగా వాట్సప్‌లో సందేశం పంపించారు. ‘ఎంఐఎం ఎమ్మెల్యేల మాదిరిగా ప్రభుత్వ భూముల సెటిల్‌మెంట్ల కోసం సమయం కోరలేదు. తన నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి ఎన్నోసార్లు సమయం కోరాను. సీఎం కేసీఆర్‌ తరహాలోనే మీరు కూడా అసెంబ్లీ సాక్షిగా తప్పించుకునే ధోరణిని అవలంబిస్తున్నారం’టూ కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఎంఐఎం ప్రజాప్రతినిధులకు ఇస్తున్న ప్రాధాన్యం ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వరా..? అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని