ఉడకని అన్నం.. నీళ్లపప్పు
వసతిగృహాలు సమస్యలకు ఆనవాళ్లుగా మారాయి. పర్యవేక్షణ కొరవడి.. వసతులు లేక.. అరకొర భోజనంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ల పప్పు.. సరిగా ఉడకని అన్నం.. కూరగాయ ముక్కలు లేని కూరలు.. రుచీపచీ లేకుండా వండి వడ్డిస్తున్నారు. ఇప్పటికే నగరంలో అక్కడక్కడ ఆహారం సరిగా....
వసతి గృహాల్లో విద్యార్థుల అవస్థలు
అటకెక్కిన మెనూ
అద్దె భవనాల్లో చలికి వణుకుతున్న చిన్నారులు
- ఈనాడు, హైదరాబాద్ - శేరిలింగంపల్లి, సరూర్నగర్, హయత్నగర్, చేవెళ్ల, న్యూస్టుడే,
శేరిలింగంపల్లిలో కనీస సామగ్రి లేని వంటశాల
వసతిగృహాలు సమస్యలకు ఆనవాళ్లుగా మారాయి. పర్యవేక్షణ కొరవడి.. వసతులు లేక.. అరకొర భోజనంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ల పప్పు.. సరిగా ఉడకని అన్నం.. కూరగాయ ముక్కలు లేని కూరలు.. రుచీపచీ లేకుండా వండి వడ్డిస్తున్నారు. ఇప్పటికే నగరంలో అక్కడక్కడ ఆహారం సరిగా లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ‘ఈనాడు’ ప్రతినిధి నగరం, శివారు ప్రాంతాల్లో పలు వసతిగృహాలను సందర్శించగా.. సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపించింది. మెనూ పాటించడం లేదు. ఉదయం రాగిజావ, పాలు మొదలుకుని రాత్రి భోజనం వరకు ప్రభుత్వ నిర్దేశిత మెనూను అటకెక్కించేశారు. గుడ్లు పెట్టడం లేదు. ఉదయం అల్పహారం బదులు అన్నం వండి పెడుతున్నారు. కూరలు లేకుండా నీళ్ల చారు పోసుకుని అన్నం తినాల్సి వస్తోందని వాపోతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే విద్యార్థులు పెద్దగా హాస్టళ్లలో ఉండటం లేదు. కొన్నిచోట్ల 10శాతం లోపే హాజరు ఉంటోంది. అయినప్పటికీ ఉన్న విద్యార్థుల తగ్గట్టుగా కూడా మెనూ పాటించకుండా గాలికొదిలేశారు. పెరిగిన కూరగాయల ధరలతో అన్ని కూరలు వండటం లేదంటూ అరకొరగానే కూరలు వండి వదిలేస్తున్నారు.
పాడైపోయిన ఫ్యాన్ రెక్కలు
ఇరుకుగదులే దిక్కు
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని వసతిగృహాల్లో చాలావరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇరుకు గదుల్లో.. వెలుతురు సరిగా లేక అవస్థలు పడుతున్నారు. కిటికీలు, తలుపులు విరిగిపోయి ఉండటంతో చలికి వణికిపోతున్నారు. ప్రభుత్వం నుంచి రగ్గులు, బట్టలు, కార్పెట్లు పంపిణీ చేయలేదు.
సరూర్నగర్లో నీటి సదుపాయం లేని సింక్లు
మరుగుదొడ్ల నిర్వహణేదీ..?
మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా మారింది. శుభ్రత పాటించకపోవడంతో రోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. 15-20 మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి అన్నట్లుగా ఉంది. కరోనా మహమ్మారితో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం పెరిగింది. అయినప్పటికీ.. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. వారానికోసారి శుభ్రం చేస్తుండటంతో అపరిశుభ్రత తాండవిస్తోంది.
ప్రమాదకరంగా ఫ్యూజ్బాక్సు
* సరూర్నగర్లోని బీసీ బాలుర వసతిగృహం.. చార్మినార్, ముషీరాబాద్కు సంబంధించిన హాస్టల్ కొనసాగుతోంది. దాదాపు పది రోజుల కిందట ఆహారం సరిగా లేక 15 మంది విద్యార్థులు అస్వస్థతకుగురయ్యారు. 820 విద్యార్థులు ఉండాల్సి ఉండగా.. కల్తీ ఆహార ఘటన తర్వాత నుంచి 15 మందే ఉంటున్నారు. అద్దె భవనం కావడంతో వెలుతురు సరిగారాక దారుణంగా ఉంది. పెద్దసంఖ్యలో వస్తే ఇరుకుగదుల్లోనే సర్దుకోవాల్సిన దుస్థితి. మరుగుదొడ్లు సరిపడా లేక అధ్వానంగా మారాయి. తలుపులు, కిటికీలు విరిగిపోయి చలికి గజగజ వణుతున్నారు. స్విచ్బోర్డులు పాడయ్యాయి.
* శేరిలింగంపల్లి బీసీ బాలుర వసతి గృహం. 120 మంది పిల్లలకుగాను 23 మందే ఉంటున్నారు. పిల్లలకు మెనూ పాటించడం లేదు. అన్నంసరిగా ఉడకకుండా రుచి లేకుండా కూరలు వండి పెడుతున్నారు. ‘ఈనాడు’ ప్రతినిధి హాస్టల్ ప్రతినిధిని సందర్శించినప్పుడు కిలో ఆలుగడ్డలు, నాలుగు టమాటాలు మినహా కూరగాయలే లేవు. కూరల్లో కూరగాయ ముక్కలు ఏరుకోవాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోతున్నారు. దుప్పట్లు ఇవ్వకపోవడంతో ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు.
మెస్ ఛార్జీలు పెంచాలి
పెరిగిన ధరలకు తగ్గట్టుగా ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచాలి. హాస్టళ్లలో ఎక్కడా మెనూ పాటించడం లేదు. ఉదయం అల్పాహారం పెట్టడం లేదు. సొంత భవనాలు లేక వేరొక ప్రాంతాల్లో అద్దె భవనాల్లో నిర్వహిస్తుండటంతో వసతులు లేక విద్యార్థులు నానాఅగచాట్లు పడతున్నారు. వెంటనే ప్రభుత్వం ఏ ప్రాంతానికి చెందిన హాస్టల్కు అక్కడే సొంత భవనం నిర్మించాలి.
- గడ్డం శ్యామ్, పీడీఎస్యూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.