రామలింగేశ్వర భూములకు రక్షణేదీ?
దేవాదాయ భూములను కాపాడుతామని ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచడంలేదు. ఇందుకు ఉదాహరణే పూడూరు మండలం దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయ భూములు. పెద్దఉమ్మెంతాల్, పూడూరు తదితర గ్రామాల పరిధిలోని వివిధ సర్వే
అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని వైనం
న్యూస్టుడే, పూడూరు
అటవీశాఖ తీయించిన కందకం
దేవాదాయ భూములను కాపాడుతామని ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచడంలేదు. ఇందుకు ఉదాహరణే పూడూరు మండలం దామగుండం రామలింగేశ్వర స్వామి ఆలయ భూములు. పెద్దఉమ్మెంతాల్, పూడూరు తదితర గ్రామాల పరిధిలోని వివిధ సర్వే నంబర్లలో ఆలయానికి విలువైన భూములు ఉన్నాయి. అప్పట్లో దాతలు స్వామివారి పేరుతో వీటిని అప్పగించారు. ఆలయం ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధీనంలో ఉంది. పూడూరు పంచాయతీ పరిధి సర్వే నంబర్లు 473, 217, 218, 219 లో 44 ఎకరాల 23 గుంటలు ఉండగా, పెద్ద ఉమ్మెంతాల్ పరిధిలో సర్వే నంబర్లు 51, 65లో 23 ఎకరాల 25 గుంటలుంది. భూ దస్త్రాల ప్రక్షాళన అనంతరం అధికారులు ధరణి పోర్టల్లో రామలింగేశ్వర స్వామి భూములను పొందుపర్చక పోవటం అనుమానాలకు తావిస్తోంది.
స్థిరాస్తి వ్యాపారంతో..
స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగటంతో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఎకరానికి రూ.రూ.50 లక్షలనుంచి రూ.3కోట్ల వరకు పలుకుతోంది. వ్యాపారులు వీటిపై కన్నేస్తే ఆ భూములు కనుమరుగయ్యేందుకు ఆస్కారం ఏర్పడనుంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటంతో పాటు హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి కలిగి ఉండటంతో పూడూరు మండలం ప్రాధాన్యత సంచరించుకుంది. ఎంతో మంది సంపన్నుల కుటుంబాలతో పాటు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన వారు ఈ ప్రాంతంలో భూములను కొనుగోలు చేసుకుని వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. నగరానికి దగ్గరగా ఉండటంతో అందరి కళ్లు పూడూరు మండలం పైనే ఉన్నాయి.
కంచె ఏర్పాటు చేస్తాం అనుమతులు ఇవ్వండి
దేవాలయానికి చెందిన భూములను కాపాడుకునేందుకు పాలకవర్గం ముందుకు వచ్చింది. రామలింగేశ్వర స్వామి ఛైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పాలకవర్గం ఇటీవల దేవాదయశాఖ కమిషనర్, జిల్లా అధికారులకు వేర్వేరుగా లేఖ రాశారు. భూములకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి పట్టా పాసుపుస్తకాలు రెవెన్యూ శాఖ నుంచి సమకూర్చుకుని కమిటీకి అందజేయాలని కోరారు.
హద్దులు గుర్తించకుండానే..
పూడూరు సర్వే నంబరు 473లోని 12.4 ఎకరాలు దేవాదాయశాఖ రికార్డుల్లో మాత్రమే ఉంది. రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు ఆన్లైన్లో నమోదు చేయలేదు. కనీసం హద్దులు కూడా గుర్తించలేదు. సర్వే చేయకపోవటంతో ఎక్కడ ఎంత విస్తీర్ణంలో భూములు ఉన్నాయనేది సందిగ్ధత నెలకొంది. పక్కనే అటవీ ప్రాంతం కావడంతో, ఆలయ భూములు అందులో కలిసిపోయాయి. హద్దులు గుర్తించకుండానే ఇటీవల అటవీశాఖ అధికారులు చుట్టూ లోతైన కందకాలు తీయిస్తున్నారు. ఆలయం దేవాదాయశాఖ పరిధిలో ఉన్నప్పటికి అటవీశాఖ అధికారులు మాత్రం మొత్తం స్థలం మాదే అంటూ ఆక్రమణకు చూస్తున్నారు. గుడివద్ద ఎటువంటి పనులు చేపట్టినా అటవీశాఖ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. పలుమార్లు స్థానికులు, భక్తులు వ్యతిరేకించడంతో మిన్నకుంటున్నా, సమస్య పరిష్కారం కావటం లేదు. పెద్దఉమ్మెంతాల్ సర్వేనంబరు 51,65 ోని 23.25 ఎకరాల భూమి ధరణి వచ్చాక అదే గ్రామానికి చెందిన ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల పేర్లతో నమోదయి ఉంది.
సమస్య పరిష్కారానికి కృషి
కిరణ్కుమార్, తహసీల్దారు, పూడూరు
అప్పట్లో పనిచేసిన కొందరు సిబ్బంది చేసిన తప్పిదంతో భూముల వివరాలు తప్పుగా నమోదయ్యాయి. కొన్ని ఆన్లైన్ కాలేదు. ఇటీవల దామగుండం భూముల ఆన్లైన్ కోరుతూ కమిటీ వారు వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు దస్త్రాలు పరిశీలిస్తున్నాం. ఇక్కడున్న ఆధారాలతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సినీ హీరో వెంకటేశ్ వియ్యంకుడు
[ 24-04-2024]
తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. -
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ