Secundrabad Club: చరిత ఘనం.. వారసత్వ అనుబంధం
చారిత్రక, వారసత్వ భవనం అగ్నికి ఆహుతైంది. 143 ఏళ్ల చరిత్ర కలిగిన క్లబ్తో అనుబంధం పెంచుకున్న సభ్యులు చాలా మంది ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పూర్వం రాజులకు, ఉన్నత హోదాల్లో ఉన్నవారికే సభ్యత్వం కల్పించి ఏళ్లుగా చెక్కుచెదరకుండా
విశేషాల సమాహారం సికింద్రాబాద్ క్లబ్
క్లబ్ భవనానికి అంటుకున్న మంటలార్పుతున్న సిబ్బంది
ఈనాడు డిజిటల్, హైదరాబాద్, న్యూస్టుడే, కంటోన్మెంట్: చారిత్రక, వారసత్వ భవనం అగ్నికి ఆహుతైంది. 143 ఏళ్ల చరిత్ర కలిగిన క్లబ్తో అనుబంధం పెంచుకున్న సభ్యులు చాలా మంది ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పూర్వం రాజులకు, ఉన్నత హోదాల్లో ఉన్నవారికే సభ్యత్వం కల్పించి ఏళ్లుగా చెక్కుచెదరకుండా కనువిందు చేసిన భవనం ఇక చరిత్రలో ఓ పేజీగా మిగిలిపోయింది. వందల ఏళ్ల నాటి భారీ వృక్షాలు క్లబ్ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ప్రమాద సమాచారంలో జాప్యంతోనే తీవ్ర నష్టం
ప్రమాదం జరిగిన సమయానికి, అగ్నిమాపక శాఖ సమాచారం చేరవేతలో జాప్యం కారణంగానే భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. తెల్లవారుజామున 2.45గంటలకు అగ్ని ప్రమాదం సంభవించినట్లు తనకు సమాచారం వచ్చిందని సికింద్రాబాద్ క్లబ్ అధ్యక్షుడు రఘురామరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలపగా..ఉదయం 3.15గం.లకు సమాచారం తెలిసినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ప్రమాద స్థలికి కూతవేటు దూరంలోనే ఫైర్ స్టేషన్ ఉండటం గమనార్హం. ఉదయం 3.10గం.ల సమయంలో రోడ్డుపై విధులు నిర్వర్తిస్తున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది మంటలు ఎగిసిపడటం చూసి స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే 6 అగ్నిమాపక బృందాలు, ఆర్మీ ఫైర్ బృందం రంగంలోకి దిగాయి. స్థానిక ఫైర్ స్టేషన్ నుంచి వెళ్లిన వాహనంతో పాటు వాటర్ బౌసర్, వాటర్ కమ్ ఫోమ్ టెండర్ తదితర వాహనాలు వెళ్లాయి. అంతర్గతంగా చెక్కతో నిర్మించిన మెట్లు పూర్తిగా దగ్ధం కావడం, బయటి నుంచి నిర్మించిన మెట్ల ద్వారా మొదటి, రెండో అంతస్తుకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో కిటికీల నుంచి మంటలు ఆర్పామని, దాదాపు ఎనిమిదిన్నర గంటలు శ్రమించామని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరుగుతోందని, ఆస్తి నష్టం అంచనాలు లెక్కిస్తున్నామని ప్రాంతీయ అగ్నిమాపక అధికారి వి.పాపయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు.
వసతులు అంతర్జాతీయ స్థాయిలో..
వేలాది మంది నగరవాసులకు ప్రత్యేక అనుబంధమున్న ఈ క్లబ్లో అంతర్జాతీయ స్థాయి వసతులన్నీ ఉండేవి. క్రీడా మైదానం సహా ఇండోర్, అవుట్డోర్ క్రీడలకు సంబంధించి అన్ని సౌకర్యాలుంటాయి. ఎయిర్ కండీషన్డ్ బార్లు, డైనింగ్ హాళ్లు, బాంకెట్ హాళ్లతో పాటు భారీ సమావేశాలు, పార్టీల కోసం అనేక పచ్చిక బయళ్లు ఉన్నాయి. విశాలమైన బాల్ రూమ్, సినిమాల ప్రదర్శనకు ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉన్నాయి. పెద్ద ఫుడ్కోర్టు ప్రత్యేక ఆకర్షణ. కాంటినెంటల్ నుంచి మొఘల్ వరకు.. చైనీస్ నుంచి ఇటాలియన్ వరకు, ఉత్తర నుంచి దక్షిణ భారతీయ వంటకాల వరకు అనేక రకాల వంటకాలు లభించేవి. ఏటా ఇక్కడ నిర్వహించే తంబోలాలో దాదాపు వెయ్యి మంది వరకు పాల్గొంటారు. నూతన సంవత్సర వేడుకలు జరుగుతుంటాయి. మరోవైపు స్పాన్సర్ వేడుకలను నిర్వహించేందుకు క్లబ్ నిర్వాహకులు అనుమతులిస్తుంటారు. సభ్యులు సామాజిక సమావేశాలు నిర్వహించుకోవాలంటే కావాల్సిన సౌకర్యాలు క్లబ్ కల్పిస్తుంది.
స్థలం ప్రభుత్వానిదే.. నిర్వహణ ప్రైవేటు వ్యక్తులది
- అజిత్రెడ్డి, కంటోన్మెంట్ సీఈవో
క్లబ్ ఉన్న స్థలం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. నిర్వహణ కోసం లీజుకు ఇచ్చారు. ఆ భవనం చాలా ప్రాచీనమైంది అందులోనూ ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉంది. పాత భవనంలోనే కార్యకలాపాలు సాగుతున్నాయి. క్లబ్కు ఓ ప్రత్యేక సంస్థ ఉంది. కమిటీ, సభ్యులు, నియమ నిబంధనలున్నాయి.
నాకు రెండో ఇల్లులాంటిది
- డా.పి.రఘురామ్, డైరెక్టర్, కిమ్స్, ఉషాలక్ష్మీ సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్
కొత్త సంవత్సరంలో ఇది విషాద ప్రారంభం. సికింద్రాబాద్ క్లబ్ నాకు రెండో ఇల్లులాంటిది. అక్కడే కుటుంబంతో గడపడం.. చిన్నప్పటి మధుర జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తున్నాయి. 143 ఏళ్లనాటి అద్భుతమైన వారసత్వ నిర్మాణం కోల్పోవడం దురదృష్టకరం. అదృష్టవశాత్తు ప్రాణనష్టం సంభవించలేదు. 30 సంవత్సరాలుగా క్లబ్ సభ్యుడిని, నాటి వైభవాన్ని పునరుద్ధరించడంలో నా వంతు సహకరిస్తాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
పలు అంశాలతో పుస్తకాల పంపిణీ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!