logo

చిలుకూరు బాలాజీ ఆలయం కిటకిట

వరుస సెలవులతో చిలుకూరు బాలాజీ ఆలయం భక్తులతో నిండిపోయింది. రెండు రోజులుగా ఆలయానికి భక్తులు విశేషంగా తరలివచ్చి బాలాజీని దర్శించుకున్నారు. శని, ఆదివారం రెండు రోజులు ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో

Published : 17 Jan 2022 05:33 IST


మందిరంలో భక్తుల సందడి

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: వరుస సెలవులతో చిలుకూరు బాలాజీ ఆలయం భక్తులతో నిండిపోయింది. రెండు రోజులుగా ఆలయానికి భక్తులు విశేషంగా తరలివచ్చి బాలాజీని దర్శించుకున్నారు. శని, ఆదివారం రెండు రోజులు ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు చిలుకూరు బాలాజీని 65 వేల మందికి పైగా దర్శించుకున్నారని అంచనా. కొవిడ్‌-19 నిబంధనలకు లోబడే భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు