నిలదీయొద్దు.. నిదానంగా చెప్పు
పిల్లల్లో విపరీత ధోరణులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న విషయాలకే అలగడం, కాస్త కసురుకుంటే మనసు చిన్నబుచ్చుకోవడం, విపరీత నిర్ణయాలు తీసుకోవడం వంటి ధోరణులు అలవడుతున్నాయి. తరచి చూస్తే ఇందుకు ఎన్నో కారణాలు
పిల్లల్లో పెరుగుతున్న క్షణికావేశాలు, విపరీత ధోరణులు
బుజ్జగించి చెప్పడమే మేలంటున్న మానసిక విశ్లేషకులు
శేరిలింగంపల్లి, న్యూస్టుడే
పిల్లల్లో విపరీత ధోరణులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న విషయాలకే అలగడం, కాస్త కసురుకుంటే మనసు చిన్నబుచ్చుకోవడం, విపరీత నిర్ణయాలు తీసుకోవడం వంటి ధోరణులు అలవడుతున్నాయి. తరచి చూస్తే ఇందుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయంటున్నారు మానసిక విశ్లేషకులు, వైద్యులు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలహీన పడటం, ఇల్లు, సెల్ఫోనే లోకంగా మసలుకోవడం వంటివి ప్రధానంగా కనిపిస్తున్న కారణాలు.
* భార్యాభర్తలు ఇరువురు మంచి ఉద్యోగస్తులు. ఏ లోటూ లేదు. ఒక్కడే కుమారుడు. అడిగింది కాదనకుండా ఇస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ‘ఆటలు ఎక్కువయ్యాయి.. ఇక చదువుకో’ అని తండ్రి మందలించాడు. అంతే 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆ క్షణిక కోపాన్ని అణచుకోలేక తాము ఉంటున్న 14వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రులకు తీవ్ర వేదన మిగిల్చి వెళ్లిపోయాడు. పిల్లల్లో పెరుగుతున్న విపరీత ధోరణులకు ఈ ఘటన అద్దం పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భావితరాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాలపై మానసిక విశ్లేషకులు, వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.
* చిన్న కుటుంబాల కారణంగా ఇంట్లో ఆడుకోవడానికి సరైన స్నేహితులు ఉండరు. బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు తక్కువ. ఇల్లు, సెల్ఫోనే లోకం. జీవితం విలువ వారికి తెలియదు. అడిగిందల్లా ఇచ్చేసి చదవడం లేదని ఒక్కసారిగా దోషిగా చేస్తామంటే పిల్లలు జీర్ణించుకోలేరు. తల్లిదండ్రులు కచ్చితంగా ఒక స్నేహితుడుగా, టీచర్గా, ఒక సూపర్వైజర్గా వ్యవహరించి తీరాలి. తప్పు చేసినప్పుడు వారిని దోషిని చేసి నిలబెట్టకూడదు. మన ఉద్వేగాన్ని వారి మీద రుద్దకూడదు. నిలదీయకుండా ఇలా చేయి అలా చేయి.. అని వివరించి చెప్పాలి. వారితో సమయం కేటాయించాలి. మాట్లాడాలి. వారితో కలిసిపోయి ఉండాల్సిందే. ఉమ్మడి కుటుంబాలున్నపుడు తల్లి, తండ్రి అరిస్తే పెద్దవాళ్లు దగ్గరకి వెళ్లడమో, వారు దగ్గరకి తీసుకొని మంచి మాటలు చెప్పడం జరిగేది కానీ ఇప్పుడన్నీ చిన్న కుటుంబాలు. భార్యాభర్తలు ఉద్యోగస్తులు. వారి వారి ఉద్యోగ ఒత్తిడిలో వారు ఉండిపోతున్నారు. పిల్లలు అడిగింది కొనిచ్చేస్తున్నారు. ఇంకేం కావాలి వారికి.. చక్కగా చదువు కోవడమేగా అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. చదవకపోతే హెచ్చరించడం, లేదంటే నాలుగు తగిలిద్దామనే ఆలోచనలో ఉంటున్నారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు.
* గతంలో పాఠశాలలు రెగ్యులర్గా ఉండేవి కాబట్టి వారు వారి భావాలు పంచుకోవడానికి స్నేహితుల రూపంలో, ఉపాధ్యాయుల రూపంలోనే దారి ఉండేది. ప్రస్తుత పరిస్థితులు దయనీయంగా మారాయి. ఆన్లైన్ క్లాసులతో వారికి సెల్ఫోన్ చేతికి చేరింది. గేమ్లు తదితర వాటి ప్రభావంతో అందులో చిక్కుకుపోతున్నారు. వారు మానవ సంబంధాలకు దూరమైపోతున్నారు. తీవ్ర కోపం, సెన్సిటీవ్టీ పెరిగిపోతున్నాయి. వారు మాటపడకుండా మారిపోతున్నారు. కొందరు సెల్ఫోన్ పక్కన ఉంటేనే తిండి తింటున్నారు. లేదంటే మారాం చేస్తున్నారు. ఇది పిల్లల్లో విపరీత ధోరణలకు కారణమౌతుందని అంటున్నారు.
ఇలా చేయండి - ఎం.ఉమాశంకర్,
సూపరింటెండెంట్, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం
కోపం, చిరాకు, సెన్సిటివిటీ, సర్దుబాటు ధోరణి లేక పోవడం వంటివి పిల్లల్లో కనిపిస్తే, ఆక్షేపణీయంగా అనిపిస్తే కౌన్సిలింగ్ ఇప్పిస్తే చాలా మంచిది. ఇది చాలా ఉపయుక్తమౌతుంది. అయినా మార్పు రాకపోతే తగిన చికిత్స అందిస్తే సరిపోతుంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకొని పిల్లల్ని కాపాడుకోవాలి. తల్లిదండ్రులు సైతం కచ్చితంగా పిల్లల పెంపకంపై కౌన్సిలింగ్ తీసుకోవాలి. జీవన విధానంలో మార్పులనేది అవసరం. లేదంటే ఈ ప్రభావం భావి పౌరులమీద పడుతుందనే విషయం మర్చిపోవద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.