logo

వామ్మో.. మళ్లీ చిరుత సంచారం

చిరుత మళ్లీ కలకలం సృష్టించింది. యాచారం మండలం పిల్లిపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి భిక్షపతి ఊరికి దూరంగా ఉండే తన వ్యవసాయక్షేత్రం వద్ద ఆదివారం రాత్రి ఆవుదూడను

Published : 18 Jan 2022 02:24 IST

యాచారం, న్యూస్‌టుడే: చిరుత మళ్లీ కలకలం సృష్టించింది. యాచారం మండలం పిల్లిపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి భిక్షపతి ఊరికి దూరంగా ఉండే తన వ్యవసాయక్షేత్రం వద్ద ఆదివారం రాత్రి ఆవుదూడను కట్టేశాడు. సోమవారం వెళ్లేసరికి సగం తిని వదిలేసిన ఆవుదూడ కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. చిరుత దానిని తినేసిందని గుర్తించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు.వారు బోను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని