logo

మెరుగైన సేవలకు కృషి: బీఎస్‌ఎన్‌ఎల్‌

వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కృషి చేస్తోందని వికారాబాద్‌ ఎస్‌డీఓటీ ప్రమోద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం దృశ్య మాధ్యమం ద్వారా వినియోగదారుతో సమీక్ష  నిర్వహించారు.

Published : 19 Jan 2022 02:43 IST


సమస్యలను తెలుసుకుంటున్న అధికారులు

వికారాబాద్‌ మున్సిపాలిటీ: వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కృషి చేస్తోందని వికారాబాద్‌ ఎస్‌డీఓటీ ప్రమోద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం దృశ్య మాధ్యమం ద్వారా వినియోగదారుతో సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వినియోగదారులు సమస్యలను వివరించారు. చరవాణి సిగ్నల్స్‌ సక్రమంగా ఉండటం లేదని, మాట్లాడుతున్న సమయంలో మధ్యలోనే కనెక్షన్‌ కట్‌ అవుతుందని తెలిపారు. నెట్‌ సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నారు. దీనికి ఆయన స్పందించి పై విధంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం(రూరల్‌) శ్రీనివాస్‌రావు, ఏజీఎం (రూరల్‌) వి.ప్రకాశ్‌, జేటీఓ రాజు, సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రావు,  బీఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని