పాఠాలకే పరిమితం.. ఆటల సాధనకు దూరం!
పాఠశాల స్థాయిలో విద్యార్థులను శారీరకంగా, మానసికంగా తీర్చిదిద్దేందుకు వ్యాయామ తరగతుల నిర్వహణకు సమయసారిణి ఖరారు చేశారు. క్రీడా సాధన..ఆటలతో విద్యార్థుల్లో ఉత్సాహం..ఉల్లాసం నింపే లక్ష్యంగా వీటిని నిర్వహించాలి.
బడుల్లో కొరవడిన సౌకర్యాలు
న్యూస్టుడే, తాండూరుగ్రామీణ
కరణ్కోటలో ప్రభుత్వ పాఠశాల మైదానం
పాఠశాల స్థాయిలో విద్యార్థులను శారీరకంగా, మానసికంగా తీర్చిదిద్దేందుకు వ్యాయామ తరగతుల నిర్వహణకు సమయసారిణి ఖరారు చేశారు. క్రీడా సాధన..ఆటలతో విద్యార్థుల్లో ఉత్సాహం..ఉల్లాసం నింపే లక్ష్యంగా వీటిని నిర్వహించాలి. బడుల్లో మైదానాల్లేక, వ్యాయామ ఉపాధ్యాయుల కొరత కారణంగా చిన్నారులు కసరత్తుకు దూరమవుతున్న వైనంపై ‘న్యూస్టుడే’ కథనం.
పాఠశాలల్లో విద్యార్థులకు వారంలో రెండు వ్యాయామ తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ తప్పనిసరి చేసింది. క్షేత్ర స్థాయిలో చాలావరకు సదుపాయాల్లేక, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోచక ఆటలకు అందనంత దూరంగా ఉంటున్నారు. ఆసక్తి ఉన్నా అసౌకర్యాలతో సాధన చేయలేకపోతున్నారు. శిక్షకులులేక క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవడం గగనంగా మారింది. క్షేత్రస్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్నిచోట్ల వారు ఉన్నప్పటికీ అనువైన మైదానాలు లేవు. ఇరుకైన తరగతి గదుల్లో పాఠాల బోధనకే పరిమితం చేస్తున్నారు.
భవిష్యత్తుపై ప్రభావం: వ్యాయామ తరగతుల నిర్వహణ వల్ల విద్యార్థులు శారీరక దేహదారుఢ్యాన్ని కలిగి ఉండేందుకు తోడ్పడుతుంది. దీంతో విద్యార్థులు చురుకుగా ఉండేందుకు దోహదపడనుంది. బడికి క్రమం తప్పకుండా హాజరయ్యేందుకు, ఉల్లాసంగా ఉండేందుకు వీలుంటుంది. అందుకు భిన్నంగా విద్యార్థులను వ్యాయామానికి దూరం చేయడంతో దుష్పరిణామాలకు దారితీస్తున్నాయి. భవిషత్తులో ఉన్నత చదువులు పూర్తిచేసి ఉద్యోగాలు పొందినా వ్యాయామానికి పరుగులు తీయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మూడు పదుల వయసులోనే వ్యాధులు చుట్టుముట్టేందుకు దారితీస్తున్నాయి. చిన్న సమస్యలకు, ఒడిదుడుకులను ఎదుర్కొనలేక వెనకబడుతున్నారు. ఉద్యోగం, కుటుంబంలోని సమస్యలను తట్టుకుని ఎదురొడ్డకుండా కుంగుబాటుకు గురవుతున్నారు.
జాడలేని క్రీడా సామగ్రి: గతంలో పాఠశాలలకు ప్రభుత్వం, దాతలు క్రీడా సామగ్రిని సమకూర్చేవారు. క్రమంగా విద్యాశాఖ ద్వారా సరఫరా నిలిచిపోయింది. పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు అందజేస్తున్న సర్కారు ఆటల సామగ్రి సరఫరాను విస్మరించింది. పాఠశాలలకు వాలీబాల్, బాస్కెట్బాల్, చెస్, క్రికెట్ బ్యాట్లు, బంతులు, స్కిప్పింగ్ రోప్లు వంటివి సమకూర్చితే సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆటల్లో రాణించేందుకు, వారిలో దాగివున్న క్రీడా ప్రతిభను చాటేందుకు, నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడనుంది. గతంలో గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో గ్రామాలు, పట్టణాల్లో పలువురు దాతలు ముందుకొని బడులకు సామగ్రిని ఉచితంగా అందించే వారు. రానురాను తగ్గిపోతోంది. ప్రభుత్వం పాఠశాలల్లో మైదానాలను అందుబాటులోకి తెచ్చేందుకు, వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులను నియమించేందుకు దృష్టి సారించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
కొన్ని ఉదాహరణలు
* తాండూరు మండలం చెంగోల్ జడ్పీహెచ్ఎస్లో ఐదు గ్రామాలకు చెందిన 300లకుపైగా విద్యార్థులు చేరారు. వీరందరికీ ఆటలపై ఆసక్తి ఉన్నా, మైదానంలో మట్టి, బండరాయితోకూడిన పెద్దఎత్తున గుట్ట ఉంది. తరగతి గదుల ముందు అరకొర ఖాళీ స్థలం ఉండగా ట్యాంకులను నిర్మించారు.
* తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలతోపాటు పట్టణంలోని వేలాది మంది విద్యార్థుల క్రీడా సాధనకు, పోటీలకు చిన్నమైదానం(మినీస్టేడియం) నిర్మించారు. 2016లో తాండూరు రెవెన్యూ డివిజన్గా అవతరించడంతో అప్పట్లో చిన్నమైదానాన్ని ఆర్డీఓ కార్యాలయంగా మార్చేశారు.
* పెద్దేముల్ మండలంలో కందనెల్లి, తట్టెపల్లి, ఇందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో క్రీడలకు మైదానాలు అందుబాట్లో ఉన్నా వ్యాయామ ఉపాధ్యాయులు లేరు.
* దౌల్తాబాద్ మండలంలో ఆరు ఉన్నత పాఠశాలలు ఉండగా, మూడు పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు లేరు.
* తాండూరు పట్టణంలోని నంబర్ వన్ పాఠశాలలో జిల్లాలోనే అత్యధికంగా 756 మంది విద్యార్థులు ఉండగా వీరందరికి ఆటలు ఆడించేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. పక్కనే ఉన్న ఉర్దూ మాధ్యమ బడిలోనూ ఇదే పరిస్థితి.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు: 1,075
విద్యార్థులు: 90వేలు
మైదానాల్లేని బడులు: 400లకుపైగా
వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీలు: సుమారు 100
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి: కేటీఆర్
[ 23-04-2024]
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డికి బుద్ధి చెప్పాలని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
[ 23-04-2024]
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానం పోటెత్తి.. చెయ్యెత్తి జైకొట్టి
[ 23-04-2024]
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
పొరుగు నేతలకే పెద్దపీట
[ 23-04-2024]
గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. -
కొండంత విశ్వాసం
[ 23-04-2024]
చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.c -
4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?
[ 23-04-2024]
రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. -
చరవాణి హ్యాక్ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా
[ 23-04-2024]
మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్కు ‘మీ ఖాతా బ్లాక్ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. -
15 స్ట్రాంగ్ రూముల్లో.. 5వేల ఈవీఎంలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ వెల్లడించారు. -
అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3
[ 23-04-2024]
నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. -
ప్రతిదానికీ ఓ లెక్కుంది..!
[ 23-04-2024]
ఫలితాల వరకు ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
[ 23-04-2024]
నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. -
స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. -
గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
[ 23-04-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రేవంత్రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల
[ 23-04-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. -
సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం
[ 23-04-2024]
జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. -
విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన డీసీఎం దగ్ధం
[ 23-04-2024]
పార్కింగ్ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
[ 23-04-2024]
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. -
సీఎం సుడిగాలి పర్యటన నేడు
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్
[ 23-04-2024]
మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం
[ 23-04-2024]
తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది. అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి
[ 23-04-2024]
జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్ సోమవారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ