ఎరువు.. ధరల దరువు
జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఈ రంగానికి సంబంధించి ఏ చిన్న మార్పు జరిగినా దాని ప్రభావం కర్షకులపై పడుతోంది. ఇటీవల ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు
ఈనాడు డిజిటల్, వికారాబాద్, న్యూస్టుడే, దౌల్తాబాద్
జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఈ రంగానికి సంబంధించి ఏ చిన్న మార్పు జరిగినా దాని ప్రభావం కర్షకులపై పడుతోంది. ఇటీవల ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, ట్రాక్టర్ అద్దె నుంచి అన్నిరకాల పెట్టుబడి ఖర్చులు పెరిగాయని, ఇలా అయితే సాగు చేయలేమని వాపోతున్నారు.
జిల్లాలో 5.90 లక్షల ఎకరాల సాగు భూములున్నాయి. రబీ సీజన్లో ప్రధానంగా జొన్న, వేరుసెనగ, సెనగ, కుసుమ, వరి పంటలు సుమారు 1.30 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఆయా పంటల అవసరాలకు జిల్లాలో 28 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందుకు అనుగుణంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉంచారు. ఇటీవల ప్రభుత్వం కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం జిల్లా రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కాంప్లెక్స్ ఎరువులు 50 కేజీల బస్తాపై రూ.200 నుంచి రూ.750 వరకు పెరిగింది. సాధారణంగా గత సీజన్లో పొటాష్ బస్తా రూ.వెయ్యికి లభించేది. ప్రస్తుతం రూ.1750 అయ్యింది. వేరుసెనగ, మొక్కజొన్న పంటలకు ప్రస్తుతం ఎరువుల అవసరం ఉంది. జిల్లాలో సుమారు 20 వేల ఎకరాలు వేరుసెనగ, మరో 7 వేల ఎకరాల్లో జొన్న సాగు చేస్తున్నారు. దీంతో కాంప్లెక్స్ ఎరువులకు గిరాకీ పెరిగింది. పొటాష్ అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా 26.26.26 రకం కాంప్లెక్స్ ఎరువులు వాడుతున్నామంటున్నారు. సాగు సమయంలో అన్నింటికి పెట్టుబడులు పెరుగుతున్నాయని, పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదని, అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు స్థానికంగా పరిశ్రమలు లేకపోవడంతో యువత, మరికొన్ని కుటుంబాలు ముంబయి, పుణె, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కృత్రిమ కొరత
కొడంగల్, పరిగి నియోజకవర్గాలు, బషీరాబాద్, యాలాల, ధారూరు మండలాల్లో వేరుసెనగ, జొన్న, వరి పంటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. ఎరువుల వినియోగం ఆయా ప్రాంతాల్లోనే అధికంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కాంప్లెక్స్ ఎరువులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో కొంత మంది డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ అనుయాయులకు, వారు సూచించిన వారికి మాత్రమే పొటాష్ లాంటి ఎరువులు లభిస్తున్నాయంటున్నారు. కొరత ఉండటంతో ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయని సమాచారం.
వ్యవసాయం చేయలేం
లక్ష్మప్ప, దౌల్తాబాద్
వ్యవసాయ పనులకే కూలీలు రావడానికి ఇష్టపడటం లేదు. అంతేకాకుండా కూలి రేట్లు పెరిగాయి. దీనికి తోడు ఇప్పుడు ఎరువుల ధరలు రెండింతలవుతున్నాయి. మాలాంటి పేద రైతులు వ్యవసాయం చేయాలంటే అప్పులు చేయడం తప్పడంలేదు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు రైతులను ఆదుకునే విధంగా ఉండాలి.
కౌలుకు ఇవ్వడం మేలు: మల్కప్ప
ఏడాది పొడవునా పండించిన పంటలకు రూ.50 నుంచి రూ.100 గిట్టుబాటు ధర పెంచుతున్నారు. ఇతర ట్రాక్టర్ అద్దె నుంచి ఎరువుల ధరల వరకు అన్నీ భారీగా పెరుగుతున్నాయి. అందుకే నష్టాలు వస్తున్నాయి. అన్నింటితో సమానంగా పంటల ధరలను పెంచితేనే బాగుపడేది. ఎరువుల ధరలు పెంచినట్లే పంటలకు పెంచాలి. లేకుంటే కౌలుకు ఇచ్చుకోవడం మేలు అనిపిస్తోంది.
ఇబ్బంది లేకుండా సరఫరా: గోపాల్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి
జిల్లాలో ఈ సీజన్ అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాం. అత్యవసర పరిస్థితుల్లో సరఫరా చేసేందుకు బఫర్ స్టాక్ సైతం సిద్ధంగా ఉంది. ఎక్కడైనా ఇబ్బంది ఉంది, సమస్యలు ఉంటే సమీపంలోని అధికారులకు ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు