logo

జాతీయ రహదారిపై టిప్పర్‌ బీభత్సం

ఓ టిప్పర్‌ అదుపుతప్పి జాతీయ రహదారిపైకి దూసుకొచ్చి ఆర్టీసీ బస్సును, కారును ఢీకొట్టి బీభత్సం సృష్టించింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎస్‌ఐ వీరభద్రం కథనం ప్రకారం.. యాదాద్రిభువనగిరి జిల్లా దేశ్‌ముఖి ప్రాంతం నుంచి

Published : 19 Jan 2022 03:59 IST


టిప్పర్‌ ఢీకొని ధ్వంసమైన ఆర్టీసీ బస్సు, కారు

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: ఓ టిప్పర్‌ అదుపుతప్పి జాతీయ రహదారిపైకి దూసుకొచ్చి ఆర్టీసీ బస్సును, కారును ఢీకొట్టి బీభత్సం సృష్టించింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎస్‌ఐ వీరభద్రం కథనం ప్రకారం.. యాదాద్రిభువనగిరి జిల్లా దేశ్‌ముఖి ప్రాంతం నుంచి మంగళవారం తెల్లవారుజామున టిప్పర్‌ లారీని డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడుపుతూ వస్తున్నాడు. తెల్లవారుజామున 4.30 గంటలకు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం జాతీయ రహదారి కూడలి వద్దకు రాగానే అదుపుతప్పి, విభాగినిని ఢీకొట్టి రోడ్డు అవతలకు దూసుకుపోయింది. ఆ సమయంలో విజయవాడ వైపు నుంచి నగరానికి వస్తున్న ఓ ఆర్టీసీ బస్సును, కారును టిప్పర్‌ బలంగా ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవగా.. ఆర్టీసీ బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో పాటు కారులోని ముగ్గురు ప్రయాణికులు అదృష్టవశాత్తు స్వల్పగాయాలై ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నగరానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని