నిర్లక్ష్యమేపెను నిప్పు
అవే తప్పులు.. అంతే నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికార యంత్రాంగం.. వెరసి నగరాన్ని వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల హైదర్నగర్లో ఓ థియేటర్ బూడిదైంది. రాణిగంజ్లో ఓ ఎలక్ట్రానిక్స్ షోరూంలో
షార్ట్ సర్క్యూట్తోనే 80 శాతం ప్రమాదాలు
ఈనాడు డిజిటల్, హైదరాబాద్.. అవే తప్పులు.. అంతే నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికార యంత్రాంగం.. వెరసి నగరాన్ని వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల హైదర్నగర్లో ఓ థియేటర్ బూడిదైంది. రాణిగంజ్లో ఓ ఎలక్ట్రానిక్స్ షోరూంలో మంటలతో భారీ నష్టం వాటిల్లింది. తాజాగా.. శతాబ్దానికి పైగా చరిత్రకు సాక్ష్యమైన సికింద్రాబాద్ క్లబ్ ప్రధాన భవనం అగ్నికి ఆహుతైపోయింది. ఇవన్నీ పెద్ద ప్రమాదాలైనా.. చిన్నపాటి నిర్లక్ష్యంతోనే జరిగినట్లు స్పష్టమవుతోంది. మంటలు చెలరేగితే ప్రాథమిక స్థాయిలోనే కట్టడి చేసే వ్యవస్థలు లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడం, తనిఖీ చేయాల్సిన వ్యవస్థలు అప్రమత్తంగా లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగి భారీ ఆస్తి నష్టానికి కారణమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నగరంలో పదికిపైగా క్లబ్లు ఉండగా.. ఒక్క దాంట్లోనూ అగ్నిమాపక వ్యవస్థ పూర్తి స్థాయిలో లేదు. అగ్నిమాపక శాఖ అధికారుల అంచనా ప్రకారం.. హైదరాబాద్లో దాదాపు 80 శాతం అగ్ని ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరుగుతున్నాయి.
ఫైరింజన్లు వెళ్లలేని పరిస్థితి.. కొన్ని భవన సముదాయాల్లో అగ్ని ప్రమాదం జరిగితే ఫైరింజన్ వెళ్లే చోటు లేకపోవడం ప్రమాద తీవ్రత, ఆస్తి నష్టాన్ని పెంచుతోంది. ఆసుపత్రులు, హోటళ్లు, షాపింగు కాంప్లెక్సుల చుట్టూ ఫైరింజన్ తిరిగేందుకు భవనం ఆవరణలో నాలుగు మీటర్ల ఖాళీ స్థలం ఉండాలి. ఇలా లేకపోవడం, పరిసరాల్లో అడ్డగోలు నిర్మాణాలు, ప్రత్యామ్నాయ మెట్ల మార్గం లేకపోవడంతో మంటలార్పే వీలుండటం లేదు.
తనిఖీలు అంతంత మాత్రమే..
నగరంలో ఏటా కొన్ని వేల నిర్మాణాలు పుట్టుకొస్తుండగా.. ఐదంతస్తులకు మించిన భవనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిలో అగ్నిమాపక శాఖ తనిఖీలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో నెలకు సగటున 10 నుంచి 12 భవనాల్లో మాత్రమే తనిఖీలు జరుగుతున్నాయి. చర్యలు తీసుకొనే విషయంలో అగ్నిమాపక శాఖ అధికారులకు పరిమిత అధికారాలు ఉండటం కూడా ఇబ్బందికరంగా మారుతోంది. గ్రేటర్లో 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే జీప్లస్ 5 కమర్షియల్ భవనాలు, షాపింగ్ కాంప్లెక్సులు, ఆసుపత్రులు, 18 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే ఐదంతస్తుల నివాస సముదాయాల్ని జీహెచ్ఎంసీ తనిఖీలు చేసి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) జారీ చేస్తుంది. ఆపై ఎత్తుండే భవనాలకు అగ్నిమాపక శాఖ ఎన్వోసీ ఇవ్వాలి. నిర్ధిష్ట ఎత్తు దాటితే భవనాన్ని తనిఖీ చేసి ఎన్వోసీ ఇచ్చే అగ్నిమాపక శాఖకు.. నిర్మాణం పూర్తయ్యాక నిబంధనలు పాటించకపోతే సీజ్ చేసే అధికారం లేకపోవడం విడ్డూరం. ఇదే అవకాశంగా కొందరు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు
-ఎం.శ్రీనివాసరెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి
అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తున్నాం. అవగాహన కల్పించడంతో పాటు ప్రతి శుక్రవారం మాక్ డ్రిల్లు నిర్వహిస్తున్నాం. చాలా ఆసుపత్రుల్లో వీటిని నిర్వహిస్తున్నాం. భారీ ప్రమాదాలు జరిగినా ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నాం.
భయపెడుతున్నా.. భద్రతను పాటించరా?
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో జరుగుతున్న అగ్నిప్రమాదాలు నగరాన్ని భయపెడుతున్నాయి. పండగరోజు సికింద్రాబాద్ క్లబ్లో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం జరగ్గా.. కనుమరోజు హైదర్గూడలోని ఒక అపార్ట్మెంట్ ఐదో అంతస్తులోని ఫ్లాట్లో మంటలు చెలరేగాయి. కొద్దిరోజుల క్రితం హైదర్నగర్లో ఒక థియేటర్ బుగ్గిపాలైంది. ఆదివారం ఎల్బీనగర్లోని ఒక బహుళ అంతస్తుల భవనం ఫ్లాట్లోని ఓవెన్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం జరగ్గా.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పెరిగే కొద్దీ పలుచోట్ల అగ్నిప్రమాదాల ముప్పు పెరుగుతోంది. పండక్కి ముందు కూకట్పల్లిలో రిప్రిజిరేటర్ లోంచి గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. విద్యుత్తు సంస్థల తూతూమంత్ర తనిఖీలు, వినియోగదారుల అలసత్వంతోడై షార్ట్ సర్క్యూట్లకు దారి తీస్తోంది. ఎక్కువగా పాత భవనాల్లో సంవత్సరాల క్రితం వైరింగ్ కాలిపోయి ప్రమాదాలకు కారణమవుతోంది. కొత్త వాటిలోనూ షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నా.. అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ఇలానూ జరగవచ్చు
విద్యుదాఘాతాలకు ప్రధానంగా అధిక విద్యుత్తు వాడకంతో తీగలు కాలిపోవడం ఒకటైతే.. షార్ట్ సర్క్యూట్తో నిప్పు అంటుకోవడం రెండోది.
* తీగల వినియోగంలో ఏ మాత్రం ప్రమాణాలు పాటించడం లేదు. ఎక్కువచోట్ల అతుకులు, ఎర్తింగ్ లోపాలు, ఓవర్లోడ్ ప్రమాదాలకు కారణం అవుతోంది.
* ఒక బాక్స్ నుంచి ఎక్కువ సాకెట్లతో కరెంట్ వినియోగం కూడా ప్రమాదాలకు కారణం అవ్వొచ్చు.
* స్పార్క్ వచ్చినప్పుడు మంటలంటుకునే గుణం ఉన్న వస్తువులు దగ్గర్లో ఉంటే అగ్నిప్రమాదాలకు దారి తీస్తున్నాయి.
* విద్యుత్తు దీపాలను వేడి గ్రహించే సామగ్రికి 0.50 మీటర్ దూరంగా ఉండాలి. అలంకరణ సామగ్రికి అతి సమీపంలోనే బల్బులను ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ ప్రమాదాలకు దారితీస్తున్నాయి.
మేల్కొలుపు ముఖ్యం
* 15 ఏళ్లు దాటిన పాత వైరింగ్ స్థానంలో కొత్త తీగలు బిగించుకోవాలి. పాత తీగలున్నచోట లోడు పెరిగితే కాలిపోయే ప్రమాదం ఉంది.
* వైరింగ్లో ఐఎస్ఐ ప్రమాణాల మేరకు నాణ్యత ఉన్న వాటినే ఉపయోగించాలి. ఇన్సులేషన్ పటిష్ఠంగా ఉండాలి.
* 10 యాంప్స్ విద్యుత్తు ఉపయోగించేచోట 20 యాంప్స్ భారం పడే పరికరాలు ఉపయోగిస్తే కాలిపోయే ప్రమాదం ఉంది. ఏసీలు, వాటర్ హీటర్స్, మైక్రో ఓవెన్, రిఫ్రిజిరేటర్ వాడే చోట తగిన వైరింగ్.. తట్టుకునే లోడు ఉందో లేదో చూసుకోవాలి.
* ఇళ్లలో, వాణిజ్య భవనాల్లో నూట్రల్ పరికరాల కోసం సరిపడా ఎర్త్ ఎలక్ట్రొడ్ ఏర్పాటు ఏర్పాటు చేసుకోవాలి. ఎర్తింగ్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.
* విద్యుత్తు స్తంభాల నుంచి ఇంటి మీటర్ వరకు ఉండే సర్వీసు తీగలను క్రమంతప్పకుండా మూడేళ్లకోసారి మార్చుకోవాలి.
* రక్షణ పరికరాలలైన సర్క్యూట్ బ్రేకర్, కరెంట్ కంట్రోలర్ బ్రేకర్లు తప్పనిసరిగా ఉండాలి.
* లైసెన్స్ కల్గిన ఎలక్ట్రిషియన్తోనే పనులు, మరమ్మతులు చేయించుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్