logo

మద్యానికి డబ్బివ్వలేదని కన్నతల్లి హత్య

మద్యానికి బానిసైన కుమారుడు డబ్బుల కోసం తల్లిని చంపిన దారుణ ఘటన నందిగామ మండలం మేకగూడలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి

Published : 19 Jan 2022 03:59 IST

నందిగామ, న్యూస్‌టుడే: మద్యానికి బానిసైన కుమారుడు డబ్బుల కోసం తల్లిని చంపిన దారుణ ఘటన నందిగామ మండలం మేకగూడలో మంగళవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన చాకలి బాలమణి(51)కి ఇద్దరు కుమారులు రమేష్‌, యాదగిరి. చిన్న కుమారుడు యాదగిరి పండుగ నేపథ్యంలో భార్యను తీసుకుని ఈనెల 16న అత్తవారింటికి వెళ్లాడు. ఇంట్లో రమేష్‌, తల్లి బాలమణి ఇద్దరూ ఉన్నారు. మంగళవారం ఉదయం తల్లి బాలమణి చనిపోయిందని రమేష్‌ చరవాణిలో తమ్ముడికి సమాచారం అందించాడు. వెంటనే ఇంటికి వచ్చి చూడగా తల్లి చనిపోయి ఉంది. మెడపై కమిలిన గాయాలు ఉండటంతో గొంతునులిమి చంపి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిని తానే చంపానని రమేష్‌ ఒప్పుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని